- నిర్వహణను విస్మరించినందుకు తొమ్మిది మంది బలి
- మహిళా ఇంజనీర్ శ్రీలక్ష్మి ఆవేదన
నాగర్కర్నూల్/అచ్చంపేట : శ్రీశైలం జల విద్యుత్తు కేంద్రంలో జరిగిన ప్రమాదం.. అనేక వైఫల్యాలను బయట పెట్టిందని జెన్కో అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీలక్ష్మి చెప్పారు. ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డితో పాటు సీనియర్ ఇంజనీర్లు హాజరైన సంతాప సభలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. జూరాల, నాగార్జునసాగర్లో జరిగిన ప్రమాదాలపై లోతుగా విశ్లేషణ జరిపి భద్రతా చర్యలపై కట్టుదిట్టమైన ప్రణాళికను రూపొందించి ఉంటే తాజా దుర్ఘటన జరిగేది కాదని లక్ష్మి వాపోయారు. ‘ఉజ్మాతో సహా నలుగురు మహిళా ఉద్యోగులం. ఉజ్మాఫాతిమా, నేను ఒకే కంచంలో తినే వాళ్లం. ఆమె భౌతికంగా దూరమైందనే విషయం ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. మా తల్లిదండ్రులకు నేను ఒక్కదాన్నే కూతుర్ని. ఈ దుర్ఘటన తర్వాత.. ఉద్యోగానికి రాజీనామా చేయమని అమ్మానాన్న చెప్పారు. అయినా నేను వెళ్లేది లేదు. పవర్హౌస్ను కాపాడుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తాం’ అని ఉద్వేగపూరితంగా అన్నారు.
Courtesy Andhrajyothi