బెంగళూరు: కరోనా నిబంధనలు ఉల్లంఘించి గుడిలో పూజలు నిర్వహించడానికి ప్రయత్నించిన 50మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన కర్ణాటకలోని దోతిహాల్ గ్రామంలో వెలుగుచూసింది. గ్రామంలోని ఓ ఆలయంలో పూజలు నిర్వహించాలని గ్రామస్థులు పట్టుబట్టారు. అయితే కరోనా నిబంధనల దృష్ట్యా గుడి తలుపులను అధికారులు మూసివేశారు. అయినాసరే వెనక్కు తగ్గని గ్రామస్థులు గుడి తలుపులు బద్దలుకొట్టి మరీ పూజలు నిర్వహించబోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. అక్కడ ఉన్న 50మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే గ్రామస్థులు తమపై తిరగబడ్డారని, పోలీసు వాహనాలను డ్యామేజ్ చేశారని అధికారులు చెప్పారు.
Courtesy Andhrajyothi