– టాప్-5 లిస్టులో తెలంగాణ
న్యూఢిల్లీ: దేశంలో వైరల్ వ్యాధులు విజంభిస్తున్నాయి. ఒకవైపు కరోనా మరోవైపు స్వైన్ ఫ్లూ వణికిస్తున్నాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి జూలై నెలాఖరు వరకు దేశంలో 2,721 స్వైన్ ఫ్లూ కేసులు నమోదు కాగా ఈ వ్యాధివల్ల 44 మంది మరణించారు. జాతీయ రోగ నియంత్రణ కేంద్రం (ఎన్సీడీసీ) గణాంకాల ప్రకారం.. అత్యధికంగా స్వైన్ ఫ్లూ కేసులు నమోదైన రాష్ట్రాల టాప్-5 లిస్ట్లో కర్నాటక (458), తెలంగాణ (443), ఢిల్లీ (412), తమిళనాడు (253), ఉత్తరప్రదేశ్ (252) ఉన్నాయి.
శ్వాసకోశ సంబంధ వ్యాధి అయిన స్వైన్ ఫ్లూ తొలుత పందుల నుంచి మనుషులకు వ్యాపించగా, ప్రస్తుతం దగ్గు, చీదడం ద్వారా మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తున్నట్టు వైద్యనిఫుణులు చెబుతున్నారు. సాధారణ ఫ్లూ లక్షణాలైన జ్వరం, దగ్గు, గొంతులో మంట, ఒళ్లు నొప్పులు, చలి వంటివి స్వైన్ ఫ్లూలో కూడా ఉంటాయని పేర్కొన్నారు. వద్ధులు, గర్భిణీ మహిళలు, ఐదు ఏండ్లలోపు పిల్లలు, ఇతర రోగాలున్నవారు స్వైన్ ఫ్లూ బారినపడే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. మరోవైపు కరోనా, స్వైన్ ఫ్లూ లక్షణాలు చాలా వరకు ఒకే విధంగా ఉండటంతో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యనిఫుణులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కరోనా పరీక్షలతో పాటు స్వైన్ ఫ్లూ రోగ నిర్ధారణ పరీక్షలు కూడా నిర్వహించాలని సూచిస్తున్నారు. శ్వాస సంబంధ రోగాలున్న వారు ముందు జాగ్రత్తగా ఇనుప్లూయెంజా టీకా వేయించుకోవాలని సూచిస్తున్నారు. అలాగే కరోనా నియంత్రణ నిబంధనలైన చేతులు శుభ్రం చేసుకోవడం, ముఖానికి మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం ఎంతో మేలని ఫోర్టీస్ ఆస్పత్రి పల్మోనరీ మెడిసిన్ డిపార్టుమెంట్ హెడ్ డాక్టర్ వికాస్ మౌర్య వివరించారు.
Courtesy: NT