- బలవంతంగా స్థలం లాక్కునే యత్నం
- అధికారులపై వైసీపీ నేత ఒత్తిడే కారణం
- విషం తాగిన బాధితురాలు.. పరిస్థితి విషమం
- కలెక్టరేట్ను ముట్టడించిన దళితులు..అరెస్టు
కనగానపల్లి, అనంతపురం వైద్యం: వైసీపీ నాయకుడి ఒత్తిడితో అధికారులు దళితుల భూమిలో గ్రామ సచివాలయ నిర్మాణానికి యత్నించగా, బాధితురాలు విషం తాగి ఆత్మహత్యకు యత్నించింది. అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం తూంచెర్ల గ్రామంలో జరిగిందీ దారుణం. గ్రామంలో సచివాలయ నిర్మాణానికి అనువైన ప్రభుత్వ భూమి ఉన్నా..పేద దళితులకు భూమి లేకుండా చేయాలని వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
378-1, 418-సీ సర్వే నంబర్లలోని 35 సెంట్ల స్థలంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్ భవనాలు నిర్మించాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం పోలీసుల సహకారంతో రెవెన్యూ అధికారులు ఆ స్థలాన్ని చదును చేపట్టగా బాధితులు వచ్చి వాగ్వాదానికి దిగారు. ఈ భూమి తమదేననీ, కొన్నేళ్లుగా తమ ఆధీనంలోనే ఉందనీ,
ఆన్లైన్లోనూ తమ పేరుమీదే ఉందని తెలిపినా అఽధికారులు చదును పనులు కొనసాగించడంతో మహిళా రైతు లక్ష్మీదేవి విషం తాగి ఆత్మహత్యకు యత్నించారు. అపస్మారక స్థితికి చేరుకున్న ఆమెను స్థానికులు అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది.
తూంచెర్ల ఘటనను నిరసిస్తూ సోమవారం అనంతపురం కలెక్టరేట్ను ముట్టడించిన దళిత నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
Courtesy Andhrajyothi