కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారిని కైకలూరు లోని ఆయన నివాసం వద్ద కైకలూరు మండలంలోని వాడవల్లి గ్రామ సర్పంచ్ గా గెలిచిన సుద్దాబత్తుల లక్ష్మిపద్మావతి గారు కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా MLA, DNR గారు మాట్లాడుతూ వాడవల్లి గ్రామ అభివృద్ధికీ మీకు ఎప్పుడు సహకారం అందిస్తాను అని, గ్రామ అభివృద్ధికీ మీరు కృషి చేయాలని కోరారు. అలాగే వాడవల్లి గ్రామ ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుద్దాబత్తుల వెంకటరమణ, బొర్రా హరిబాబు, వాడరేవు రామారావు, కఠారి నరసింహ, బ్రహ్మజీ, యర్రంశెట్టి వాసు, సుద్దాబత్తుల అజయ్, శ్రీనివాసరావు, దాసు, యర్రంశెట్టి రాంబాబు, బత్తుల వెంకటేశ్వరరావు, మానికొండ రామాంజనేయులు, తోట కిరణ్, సుద్దాబత్తుల వంశీ యువకులు తదితరులు పాల్గొన్నారు.