కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారిని నియోజకవర్గంలోని కైకలూరు మండల జడ్పీటీసీ కురేళ్ళ బేబీ, కలిదిండి మండల జడ్పీటీసీ బొర్రా సత్యవతి, ముదినేపల్లి మండల జడ్పీటీసీ ఈడే వెంకటేశ్వరమ్మ, అదేవిదంగా కైకలూరు ఎంపీపీ అడవి కృష్ణ, ముదినేపల్లి ఎంపీపీ రామిశెట్టి సత్యనారాయణ, ముదినేపల్లి మండలంలోని 8 మంది విజయం సాధించిన ఎంపీటీసీలు కలిశారు. ఈ సందర్బంగా MLA, DNR గారు జడ్పీటీసీ సభ్యులకు, ఎంపీటీసీ సభ్యులకు, పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు,, ఈకార్యక్రమంలో శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ కైకలూరు నియోజకవర్గం చరిత్రలో ఎప్పుడు ఎవరికీ ఇవ్వనట్టువంటి మెజారిటీ మన జడ్పీటీసీ సభ్యులు ఈడే వెంకటేశ్వరమ్మ 16517, బొర్రా సత్యవతి 15353, కురేళ్ళ బేబీ 11808 ఓట్ల మెజార్టీ ఇచ్చారు. ప్రజలకు కైకలూరు నియోజకవర్గం 4 మంది జడ్పీటీసీలు ఎప్పుడు రుణపడి వుంటారు అని అన్నారు. నిత్యం ప్రజల సేవలో వుంటూ ప్రజల సమస్యలు పరిష్కరించాలని తెలిపారు, ఈ రోజు కైకలూరు నియోజకవర్గం నుంచి 4 జడ్పీటీసీలు 67 ఎంపీటీసీ స్థానాలు గెలుపొందటం చాలా ఆనందంగా వుంది అని అన్నారు. ఈకార్యక్రమంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాల పార్టీ నాయకులు, కార్యకర్తలు వివిధ గ్రామాల సర్పంచ్లు, తదితరులు పాల్గొన్నారు.