జాన్ పేట గ్రామంలో గత 20 ఏళ్లుగా ఏ పాలకులు కుడా పరిష్కారానికి కృషి చేయని అతి పెద్ద సమస్య మురుగు నీరు, వర్షపు నీరు గ్రామం ధాటి బయటకు వెళ్ళే డ్రైనేజి వ్యవస్థ లేకపోవడం. ఇన్నాళ్ళకు ఆ సమస్యకు పరిష్కారం ప్రజల మనిషి, కైకలూరు MLA శ్రీ దూలం నాగేశ్వరరావు గారి కృషితో, కైకలూరు MPP అభ్యర్ధి శ్రీ అడవి కృష్ణ గారి చొరవతో లభించింది.
ఆటపాక శివారు జాన్ పేట గ్రామంలో మురుగునీరు, వర్షపు నీరు గ్రామం బయటకు వెళ్ళే వ్యవస్థ లేనందున వర్షాకాలంలో ఇళ్ళ మధ్య నీరు నిలచి అనేక రకాల వ్యాధులతో గ్రామస్తులు సతమయ్యే వారు, జాన్ పేట యూత్ అసోసియేషన్ అభ్యర్ధన మేరకు గత వారం శ్రీ అడవి కృష్ణ గారు జాన్ పేట గ్రామ పర్యటనలో ఈ సమస్యలను గుర్తించి గౌరవ MLA గారి దృష్టికి తీసుకువెళ్ళగా వెంటనే పంచాయతి ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చి డ్రైనేజి పూడికతీత పనులు మొదలు పెట్టారు.
https://www.facebook.com/navasakam/videos/738571800023291/
ఈ సందర్భంగా ఒత్తిడులకు తలొగ్గకుండా జాన్ పేట గ్రామ సమస్యల పరిష్కారానికి నిత్యం కృషి చేస్తూ సహాయ సహకారాలు అందిస్తున్న గౌరవ MLA DNR గారికి, కైకలూరు MPP అభ్యర్ధి అడవి కృష్ణ గారికి, ప్రభుత్వ అధికారులకు జాన్ పేట యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మదన్ కుమ్మరికుంట, సెక్రటరీ విజయకుమార్ వంగలపూడి, వైస్ ప్రెసిడెంట్ సతీష్ కూనవరపు ధన్యవాదాలు తెలియచేశారు.
John Peta Village Drainage works by Kaikaluru MLA Sri Dulam NageswaraRao.