- విడుదలైన 24 గంటల్లోపే జేసీ ప్రభాకర్రెడ్డి తిరిగి జైలుకు..
అనంతపురం : టీడీపీ సీనియర్ నాయకుడు, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డిని మళ్లీ అరెస్టు చేశారు. గతంలో నమోదుచేసిన సెక్షన్లకు మరికొన్నింటిని జోడించి శుక్రవారం సాయంత్రం అనంతపురం పోలీ్సస్టేషన్లోనే అదుపులోకి తీసుకొన్నారు. కరోనా నిబంధనల ఉల్లంఘన, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లనూ మోపారు. జేసీ ప్రభాకర్రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్రెడ్డి ముందురోజే బెయిల్పై కడప సెంట్రల్ జైలు నుంచి విడుదల అయ్యారు. విడుదలయి 24 గంటలు గడవకముందే తిరిగి జేసీ ప్రభాకర్రెడ్డిని అదే కడప జైలుకు తరలించారు. ఈ సమయంలో పోలీ్సస్టేషన్లో అత్యంత నాటకీయ పరిణామాలు చోటుచేసుకొన్నాయి. కోర్టు కండీషన్ బెయిల్ ఇవ్వడంతో సంతకం చేయడానికి వన్టౌన్ పోలీ్సస్టేషన్కు జేసీ ప్రభాకర్రెడ్డి, జేసీ అస్మిత్రెడ్డి వచ్చారు. సంతకాల పని పూర్తిచేసి బయలుదేరుతుండగా పోలీసులు అడ్డుకొన్నారు. అక్కడే కూర్చోవాలని చెప్పారు. ‘సంతకాలు అయిపోయాయి కదా. ఎందుకు స్టేషన్లో కూర్చోమంటున్నారు? నా ఆరోగ్యం సరిగ్గా లేదు. టాబ్లెట్లు వేసుకోవాలి’ అని జేసీ ప్రభాకర్రెడ్డి వారితో అన్నారు.
అయినా మధ్యాహ్నం మూడు గంటల దాకా ఆయనను కదలనీయలేదు. అక్కడినుంచి ఒక్కో కేసు తెరపైకి రావడం మొదలయింది. మొదటిది తాడిపత్రి రూరల్ సీఐ దేవేంద్రకుమార్ ఫిర్యాదుతో పెట్టిన ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు. రెండోవది కొవిడ్ నిబంధనలను మీరిన కేసు. వీటితోపాటు 506, 189, 353, 52 సెక్షన్ల కింద మరో నాలుగు కేసులు మోపారు. అక్కడినుంచి గుత్తి కోర్టుకు ప్రభాకర్రెడ్డిని తరలించారు. ఈ నెల 21వ తేదీ వరకు ఆయనకు ఫస్ట్క్లాస్ మేజిస్ర్టేట్ శారద రిమాండ్కు విధించారు. ఆ వెంటనే వారిని కడప సెంట్రల్ జైలుకు తరలించారు. ‘‘మేం కొవిడ్తో పోవాలని ప్రభుత్వం చూస్తోంద‘‘ని కోర్టు వద్ద ప్రభాకర్రెడ్డి వ్యాఖ్యానించారు.
అసలేం జరిగిందంటే..
కడప జైలు నుంచి విడుదలై గురువారం తాడిపత్రికి ప్రభాకర్రెడ్డి, అస్మిత్ బయలుదేరారు. సజ్జలదిన్నె సమీపంలో తనిఖీల కోసం వారి కాన్వాయ్ను సీఐ దేవేంద్రకుమార్ ఆపారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సమయంలో కులం పేరుతో తనపై ఆయన దుర్భాషలాడినట్టు సీఐ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్కడినుంచి వారు తాడిపత్రిలోని తమ నివాసానికి చేరుకున్నారు. టీడీపీ శ్రేణులతో పాటు జేసీ కుటుంబ అభిమానులు బాణాసంచా పేల్చి నివాసం వద్ద స్వాగతం పలికారు. దీనిపై కొవిడ్ ఉల్లంఘన కేసును పోలీసులు పెట్టారు.
జగన్ది రాక్షసానందం: చంద్రబాబు
జైలు నుంచి విడుదలైన 24గంటల్లోపే జేసీ ప్రభాకర్రెడ్డిని మళ్లీ అరెస్ట్ చేయడం వైసీపీ కక్ష సాధింపు చర్యలకు నిదర్శనమని, అక్రమ కేసులు పెట్టి జగన్ రాక్షసానందం పొందుతున్నారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనానూ కక్ష కోసం వాడుకునే స్థాయికి జగన్ దిగజారారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ విమర్శించారు. రాష్ట్రానికి జగన్ రూపంలో శనిద్రం పట్టిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ఆగ్రహించారు.
Courtesy Andhrajyothi