- మరణాలు
- ఉత్తర ఇటలీ మూసివేత
- అమెరికాలో మరో ముగ్గురి మృతి
- ఇరాన్లో 70వేల మంది ఖైదీల విడుదల
- చైనాలో తాత్కాలిక ఆస్పత్రుల మూసివేత
వాషింగ్టన్, మార్చి : కరోనా మహమ్మారి వంద దేశాలకు విస్తరించింది. తాజా గణాంకాల ప్రకారం 100 దేశాల్లోని లక్షా పదివేలమందికి పైగా ప్రజలకు ఇది సోకింది. వీరిలో 3800 మంది ఇప్పటికే మరణించారు. ఇరాన్లో సోమవారం ఒక్కరోజే ఏకంగా 600 మందికి సోకింది. 49 మంది తాజాగా చనిపోవడంతో మృతుల సంఖ్య 240 దాటింది. మొత్తం కేసులు 7,200కు పెరిగాయి. కరోనా ప్రబలంగా ఉండడంతో దాదాపు 70వేల మంది ఖైదీలను తాత్కాలికంగా విడుదల చేశారు. అయితే వీరెవ్వరూ సమాజంలో కరోనా వ్యాప్తికి తెగబడకుండా చర్యలు తీసుకున్నట్లు ఆ దేశ న్యాయశాఖ మంత్రి ఇబ్రహీం రైసీ చెప్పారు.
మద్యం తాగితే కరోనా రాదనుకుని..
మద్యం తాగితే కరోనా రాదని సోషల్ మీడియాలో జరిగిన ప్రచారాన్ని నమ్మి కల్తీ మద్యం సేవించిన 27 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరు వాయువ్య రాష్ట్రం ఖుజెస్తాన్, ఉత్తరప్రాంతంలోని అల్బార్జ్ రా్ట్రష్ట్రాలకు చెందిన వారు. దేశంలో మద్యం నిషేధం కావడంతో ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుని మెథనాల్ తాగారు. మొత్తం 218 మంది ఆసుపత్రిపాలు కాగా అనేకమంది చావుబతుకులతో పోరాడుతున్నారు. చైనా ఇపుడిపుడే తెరిపిన పడుతోంది. తాజాగా 22మంది మరణాలు నమోదైనప్పటికీ గత నెలరోజుల్లో ఇవి చాలా తక్కువ. మొత్తం మృతులు 3119. కేసుల సంఖ్య 40కి తగ్గింది. దీంతో వైర్సను ఎదుర్కొనడానికి ఏర్పాటుచేసిన 11 తాత్కాలిక ఆసుపత్రులను చైనా ప్రభుత్వం మూసేసింది.
ఇటలీ.. భయానక స్థితి
ఇటలీలో పరిస్థితి చాలా చాలా గడ్డుగా తయారైంది. ఒక్క రోజులోనే 133 మంది చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 366 దాటింది. వ్యాప్తి కూడా 25 శాతం పెరిగి- కేసుల సంఖ్య 7375 దాటింది. దేశ ఉత్తరప్రాంతం మొత్తాన్ని షట్డౌన్ చేశారు. ఇందులో 14 రాష్ట్రాలున్నాయిలాంబర్డీ ప్రధానమైనది. అతి పెద్ద నగరం మిలన్ ఇక్కడే ఉంది. 16 మిలియన్ మందిని దీన్ని నిరసిస్తూ పౌరులు ఎదురుతిరిగారు. ఎక్కడికక్కడ రవాణా ఆంక్షలతో దేశం అట్టుడుకుతోంది. స్కూళ్లు, జిమ్లు, నైట్ క్లబ్లు, మ్యూజియాలు, ఇతర సాంస్కృతిక వేదికలు. ఇలా అన్నింటినీ దేశమంతా మూసేశారు. జర్మనీలో కేసులు వెయ్యి దాటాయి. పోర్చుగీసు అధ్యక్షుడు మార్సెలో రెబేలో సౌసా (71) స్వయం-ఏకాంతవాసంలోకి వెళ్లిపోయారు.
ప్రిన్సెస్ నౌకకు లంగరు
అమెరికాలో మరో ఇద్దరు చనిపోయారు. కేసుల సంఖ్య 500 దాటింది. ఓరెగాం రాష్ట్రం కూడాతాజాగా ఆరోగ్య ఎమర్జెన్సీ ప్రకటించింది. కాలిఫోర్నియా తీరంలో ఉన్న గ్రాండ్ ప్రిన్సెస్ నౌకను ఎట్టకేలకు లంగరు వేస్తున్నారు. ఇందులో ఉన్న 3500 మందిలో కరోనా సోకిన 21 మందినీ వెంటనే ఆసుపత్రులకు తరలించారు. విదేశీయులను వారి వారి దేశాలకు పంపేస్తున్నారు. మిగిలిన వారిని మూడు రాష్ట్రాల్లో 14రోజుల పాటు క్వారంటైన్ చేస్తున్నారు.
కరోనాను జయించిన శతాధికుడు
వృద్ధులను కరోనా సులువుగా దెబ్బతీస్తోన్నట్లు డాక్టర్లు చెబు తున్నారు. కానీ చైనాలో ఓ శతాధిక వృద్ధుడు కరోనాను జయించా డు. వైరస్ కేంద్ర స్థానమైన వుహాన్ నగరానికి చెందిన ఈ 101 ఏళ్ల వ్యక్తిని ఫిబ్రవరి 24న హ్యుబై రాష్ట్రంలోని మెటర్నిటీ, చైల్డ్ కేర్ ఆసుపత్రిలో ఏకాంతంగా ఉంచి మందులు అందించారు. అతనికి శ్వాసకోస సంబంధ వ్యాధితో పాటు అల్జీమర్స్, హైపర్ టెన్షన్ లాంటి ఆరోగ్య సమస్యలూ ఉన్నాయి. ఇప్పుడు కరోనాను జయించిన అతి పెద్దవయస్కుడిగా రికార్డులకెక్కాడు.
Courtesy Andhrajyothi