- ఫలితాల్లో ఐఐటీ, ఎన్ఐటీ పట్టభద్రుల హవా
హైదరాబాద్, అమరావతి : సివిల్స్-2019 ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. రెండు రాష్ట్రాలకు చెందిన 30 మందిపైగా ర్యాంకులు సాధించారు. టాప్-100 ర్యాంకుల్లో ఐదుగురు మనవారు ఉన్నారు. హైదరాబాద్కు చెందిన పెద్దిటి ధాత్రిరెడ్డి (46వ ర్యాంక్) తెలుగు రాష్ట్రాల టాపర్గా నిలిచారు. గుంటూరుకు చెందిన మల్లవరపు సూర్యతేజ (76వ ర్యాంక్), కట్టా రవితేజ (హైదరాబాద్, 77వ ర్యాంక్), విశాల్ తేజ్రాజ్ నర్వది (91వ ర్యాంక్), సింగారెడ్డి రుషికేశ్ రెడ్డి (కడప జిల్లా, 95వ ర్యాంక్) ఉత్తమ ర్యాంకులు సాధించారు. కాగా, ఈసారి విజేతల్లో పలువురు ఇంజనీరింగ్ నేపథ్యం నుంచి వచ్చినవారున్నారు. కొందరు ప్రతిష్ఠాత్మక ఐఐటీ, ఎన్ఐటీల్లో చదివినవారు కావడం గమనార్హం. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు చెందిన ఎంవీ సత్యసాయి కార్తీక్ (103వ ర్యాంక్), తాటి మాకుల రాహుల్కుమార్ రెడ్డి (117వ ర్యాంక్), జంగం కులదీప్ (135వ ర్యాంక్), కె.ప్రేమసాగర్ (170వ ర్యాంక్), సి.చైతన్యకుమార్ రెడ్డి (250వ ర్యాంక్), చీమల శివగోపాల్రెడ్డి (263వ ర్యాంక్), బి.రాహుల్ (272వ ర్యాంక్), వి.తేజదీపక్ (279వ ర్యాంక్), గొరిజాల మోహన్ కృష్ణ (283వ ర్యాంక్), ఎ.వెంకటేశ్వరరెడ్డి (314వ ర్యాంక్), ముత్తినేని సాయితేజ (344వ ర్యాంక్), రేణుకుంట శీతల్ కుమార్ (417వ ర్యాంక్), ముక్కెర లక్ష్మీ పావన గాయత్రి (427వ ర్యాంక్), కొల్లాబత్తుల కార్తీక్ (428వ ర్యాంక్), ఎన్.వివేక్ రెడ్డి (485వ ర్యాంక్), నీతిపూడి రష్మితారావు (534వ ర్యాంక్), కోరుకొండ సిద్దార్థ (566వ ర్యాంక్), సుసాన్ బ్లెస్సీ బక్కి (585వ ర్యాంక్), చిలుముల రజనీకాంత్ (598వ ర్యాంక్), సి.సమీర్ రాజా (603వ ర్యాంక్), కొప్పిశెట్టి కిరణ్మయి (633వ ర్యాంక్), పోలుమతి శరణ్య (653వ ర్యాంక్), దీపక్ సింగ్ (686వ ర్యాంక్), డి.రమేష్ (690వ ర్యాంక్), ఎస్.పలని ఫణికిరణ్ (698వ ర్యాంక్), బుక్యా నరసింహస్వామి (741వ ర్యాంక్), కె.శశికాంత్ (764వ ర్యాంక్), బచ్చు ధీరజ్ కుమార్ (768వ ర్యాంక్), రవికుమార్ మీనా (793వ ర్యాంక్) విజేతల జాబితాలో ఉన్నారు.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరంనకు చెందిన మధిర వెంకట సత్యసాయి కార్తీక్ 103వ ర్యాంక్ సాధించారు.
జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడికి చెందిన కేసారపు ప్రేమ్సాగర్ సివిల్స్లో 170వ ర్యాంకు సాధించారు.
రిటైర్డ్ ఐఏఎస్ ఎస్.బాలసుబ్రమణ్యం కుమారుడు ప్రత్యూష్ 216వ ర్యాంకు సాధించారు. జనరల్ స్టడీ్సపై ఎక్కువ దృష్టిపెట్టానని ఆయన చెప్పారు.
నారాయణపేట పద్మారెడ్డికాలనీకి చెందిన బి.నర్సింహులు, శశికళ దంపతుల కుమారుడు రాహుల్ సివిల్స్ ఫలితాల్లో 272వ ర్యాంక్ సాధించారు. ఎన్ఐటీ వరంగల్లో చదివిన నర్సింహులు ఏఈగా పనిచేశారు.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మచ్చర్ల గ్రామానికి చెందిన మగ్గిడి సచిన్ 296వ ర్యాంకు సాధించారు. రెండో ప్రయత్నంలో ఈ ర్యాంకు సాధించారు. వరంగల్లోని ఆర్ఈసీలో ఇంజనీరింగ్ పూర్తిచేశారు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణానికి చెందిన సిరిశెట్టి సంకీర్త్ సివిల్స్లో 330వ ర్యాంకు సాధించారు. ఈయన బీటెక్ చదివారు.
కరీంనగర్కు చెందిన ముక్కెర లక్ష్మీ పవన గాయత్రి 427వ ర్యాంక్ సాధించారు. నాన్న గౌతమ్ కుమార్ యాదవ్ రిటైర్డ్ మెడికల్ ఆఫీసర్. అమ్మ శైలజ ప్రభుత్వ పాఠశాలో స్కూల్ అసిస్టెంట్గా చేస్తున్నారు. గాయత్రి ఐఐటి ఖరగ్పూర్లో ఎలక్ట్రికల్ చేశాను.
కుమరం భీం జిల్లా కాగజ్నగర్ పట్టణానికి చెందిన వివేకానంద శుక్లా(33) సివిల్స్లో 457వ ర్యాంకు సాధించారు. వివేకానంద శుక్లా తండ్రి కాగజ్నగర్ పట్టణంలోని ఎస్పీఎం మిల్లు ఉద్యోగి. ఖమ్మం జిల్లా వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్లాల్ కుమారుడు మృగేంధర్లాల్ సివిల్స్లో 505వ ర్యాంకు సాధించారు. మృగేంధర్లాల్ గతేడాది సివిల్స్లో 551వ ర్యాంకు సాధించారు. ఆదిలాబాద్ మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ తనయుడు రాథోడ్ రాహుల్ సివిల్స్లో 745వ ర్యాంకు సాధించారు. 2016 సివిల్స్లో ఎంపికైన ఆయన ఇండియన్ రెవెన్యూ సర్వీ్సలో పనిచేస్తున్నారు.
సొంత ప్రిపరేషన్తో సాధించిన ధాత్రిరెడ్డి
సివిల్స్ తాజా ఫలితాల్లో 46వ ర్యాంకర్ పెద్దిటి ధాత్రిరెడ్డి స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం గుండ్లబావి. ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నారు. గత ప్రయత్నంలో సొంత ప్రిపరేషన్తో ఆమె 233వ ర్యాంక్ సాధించి ఐపీఎ్సకు ఎంపికయ్యారు. ధాత్రిరెడ్డి తండ్రి కృష్ణారెడ్డి వ్యవసాయం, వ్యాపారం చేస్తుంటారు. ఆమె పదో తరగతి వరకు హైదరాబాద్ సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్లో, ఇంటర్ సెయింట్ ప్యాట్రిక్స్ కళాశాలలో చదివారు. ఖరగ్పూర్ ఐఐటీ నుంచి 2016లో బీటెక్ పూర్తి చేశారు. ఫీడ్ ఇండియా స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి కార్యక్రమాలు నిర్వహించారు. ‘కొన్నాళ్లు డచ్ బ్యాంక్లో ముంబై శాఖలో ఉద్యోగం చేశా. అక్కడ వచ్చే జీతంతో పోలిస్తే సివిల్ సర్వెంట్గా వచ్చేది పదో వంతే. కానీ, సామాజిక సేవ చాలా ఇష్టం. మెటీరియల్ సేకరించుకుని చదవడమే తప్ప, కోచింగ్ తీసుకోలేదు’అని ధాత్రిరెడ్డి చెప్పారు.
మూడో ప్రయత్నంలో లక్ష్య సాధన: రవితేజ
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్కు చెందిన కట్టా రవితేజ సివిల్స్లో 77వ ర్యాంక్ సాధించారు. ఆయన పదో తరగతి వరకు హైదరాబాద్లోని సెయింట్పాల్ హైస్కూల్లో చదివారు. డీడీ కాలనీలోని శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్, ఢిల్లీలోని నిట్ కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. రెండో ప్రయత్నంలో ఇండియన్ పోస్టల్ సర్వీసె్సకు అర్హత సాధించగా, మూడో ప్రయత్నంలో 77వ ర్యాంకు సాధించారు. ‘అమ్మ కొంతకాలం జర్నలిస్టుగా చేశారు. సివిల్స్లో నా ఆప్షనల్ సబ్జెక్టు గణితం. ఈసారి ఐఏఎస్ వచ్చే అవకాశం ఉంది. సమాజానికి ఏవిధంగా ఉపయోగపడగలను అన్న ఆలోచన ఉంటేనే ఇటువైపు రావాలి’ అని చెప్పారు.
నాన్నే నాకు స్ఫూర్తి
గుంటూరుకు చెందిన మల్లవరపు సూర్యతేజ సివిల్స్ ఫలితాల్లో 76వ ర్యాంకును సాధించారు. నాలుగోసారి ఆయన ఉత్తమ ర్యాంకు పొందారు. ‘మాది గుంటూరులోని శ్యామలనగర్. ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాం. నాన్న శ్రీనివా్సరావు కేంద్ర ప్రభుత్వంలోని లేబర్ బ్యూరో అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు. 2014లో చనిపోయారు. సివిల్స్ సాధనలో నాకు నాన్నే స్ఫూర్తి. ఏడో తరగతి నుంచి దినపత్రిక చదవకుండా ఉండలేదు. ముఖ్యంగా ‘ఆంధ్రజ్యోతి’ చదివేవాడిని’ అనివివరించారు.
సీనియర్ల మార్గదర్శనంతో..
ఏపీలోని కడప జిల్లా వేంపల్లెకు చెందిన సింగారెడ్డి రుషికేష్ రెడ్డి సివిల్స్ ఫలితాల్లో 95వ ర్యాంక్ సాధించారు. నాన్న సుబ్బారెడ్డి వ్యాపారి. ‘ఢిల్లీ ఐఐటీలో బీటెక్ (ఎలక్ట్రికల్) చేశాను. అయిదో యత్నంలో ర్యాంక్ సాధించాను. సీనియర్ల గైడెన్స్ బాగా ఉపయోగపడింది. ఇంటర్నెట్ను ఉపయోగించుకున్నాను. సివిల్స్కు పట్టువదలని తత్వం ఉండాలి. అప్పుడే విజయం లభిస్తుంది’ అన్నారు.
రైతు బిడ్డ.. సివిల్స్ టాపర్
- · ఢిల్లీ యువకుడు జతిన్కు రెండో ర్యాంకు
- · యూపీ యువతి ప్రతిభా వర్మకు 3వ ర్యాంకు
న్యూఢిల్లీ : సివిల్ సర్వీసెస్-2019 పరీక్షల ఫలితాలను యూపీఎ్ససీ మంగళవారం విడుదల చేసింది. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్(ఐఏఎస్), ఇండియన్ ఫారిన్ సర్వీస్(ఐఎ్ఫఎస్), ఇండియన్ పోలీస్ సర్వీస్(ఐపీఎస్), ఇతర కేంద్ర, గ్రూప్ ‘ఏ’, గ్రూప్ ‘బీ’ సర్వీసుల్లో మొత్తం 927 ఖాళీలకు గాను 829 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు ప్రకటించింది. వీరిలో 304 మంది జనరల్ కేటగిరీలో, ఓబీసీ కేటగిరీ నుంచి 251 మంది, ఎస్సీ కేటగిరీ నుంచి 129 మంది, ఎస్టీ కేటగిరీ నుంచి 67 మంది అర్హత సాధించినట్లు యూపీఎ్ససీ వివరించింది. తొలిసారి ప్రవేశపెట్టిన ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్) కోటా నుంచి 78 మంది ఎంపికైనట్లు తెలిపింది. 182 మంది ఫలితాలను రిజర్వ్లో పెట్టినట్లు, 11 మంది ఫలితాలను విత్హెల్డ్లో ఉంచినట్లు పేర్కొంది. హరియాణా రాష్ట్రం సోనిపట్కు చెందిన ప్రదీ్పకుమార్సింగ్ టాపర్గా నిలిచారు. ప్రదీ్పది వ్యవసాయ కుటుంబం. ఢిల్లీకి చెందిన జతిన్ కిశోర్ రెండో ర్యాంకు, ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రతిభా వర్మ మూడో ర్యాంకు (మహిళల్లో మొదటిర్యాంకు) సాధించారు. 2019 మే నెలలో సివిల్స్ ప్రిలిమినరీ, సెప్టెంబరులో మెయిన్స్ జరిగాయి. 2020 ఫిబ్రవరిలో ఇంటర్వ్యూ ప్రక్రియ ప్రారంభమైంది. 500 మంది ఇంటర్వ్యూ అనంతరం కొవిడ్ కారణంగా వాయిదా వేశారు. తిరిగి జూలై 20వ తేదీ నుంచి ప్రారంభించి 31వ తేదీతో ముగించారు. సివిల్స్ విజేతలను ప్రధాని మోదీ అభినందించారు.
నాన్న ప్రేరణతో..
‘ఓ దశలో ఉద్యోగం, చదువు సమతూకం కష్టమైంది. దీంతో ఏకాగ్రత కోల్పోయేవాడిని. ఆ సమయంలో నాన్న సుఖ్బీర్ సింగ్ రైతు అండగా నిలిచి ప్రేరణ కలిగించారు’ అని సివిల్స్ టాపర్ ప్రదీప్కుమార్ తన విజయ నేపథ్యాన్ని వివరించారు. 29 ఏళ్ల ప్రదీప్కుమార్ నాలుగుసార్లు సివిల్స్ రాశారు. 2019 సివిల్స్లోనే ఇండియన్ రెవెన్యూ సర్వీస్(కస్టమ్స్-సెంట్రల్ ఎక్సైజ్)కు ఎంపికై ప్రస్తుతం నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్లో శిక్షణలో ఉన్నారు.వ్యవసాయం, విద్యా రంగాలపై దృష్టిసారించి పేద, వెనుకబడిన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తానని చెబుతున్నారు. కాగా, పద్రీప్ తండ్రి సుఖ్బీర్ సింగ్ రైతు. తల్లి గృహిణి. సోదరుడు బీమా రంగంలో పనిచేస్తుండగా.. చెల్లెలు ఎంఎస్సీ చదువుతోంది. తన విజయం స్ఫూర్తితో.. ఎలాంటి ఒత్తిడి లేకుండా చెల్లిని కూడా సివిల్స్ సాధన దిశగా ప్రోత్సహిస్తానని ప్రదీప్ చెప్పారు.
జతిన్ కిషోర్ తొలి ప్రయత్నంలో.. 2018 సివిల్స్లో ఇండియన్ ఎకనామిక్ సర్వీస్(ఐఈఎ్స)కు ఎంపికయ్యారు. ప్రస్తుతం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖలో ఏడీగా పనిచేస్తున్నారు. ‘పర్యావరణం, విద్యా రంగాలపై దృష్టిసారిస్తా’ అని ఆయన తెలిపారు.
ప్రతిభావర్మ మహిళల విభాగంలో టాపర్గా నిలిచారు. 2018 సివిల్స్లో 489 ర్యాంక్ సాధించిన ఆమె ప్రస్తుతం ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఆదాయ పన్ను)లో పనిచేస్తున్నారు. కలెక్టర్ కావాలన్నది తన చిన్ననాటి కలగా తెలిపారు. ‘సంక్షోభ సమయాల్లో ముందుండి ఐఏఎస్ అధికారులు వ్యవహరించే తీరు చూసి స్ఫూర్తి పొందా. ఐఆర్ఎస్ వచ్చినా సంతృప్తిపడక ఐఏఎస్ కోసం ప్రయత్నించా. మహిళా సాధికారత, పిల్లల సంక్షేమం నా ప్రాధాన్యాంశాలు. సివిల్స్ సాధనలో నా తల్లిదండ్రుల పోత్సాహం కీలకంగా నిలిచింది’ అని చెప్పారు.
Courtesy Andhrajyothi