ఏప్రిల్ 22 లెనిన్ 150వ జయంతి. ఈ సందర్భంగా సామ్రాజ్యవాద దశలోని పెట్టుబడిదారీ విధానాన్ని అర్ధం చేసుకోవటానికి మార్క్సిజాన్ని సృజనాత్మకంగా అన్వయించటంలో లెనిన్ సాగించిన విశేష ప్రజ్ఞ గురించి చర్చలు జరుగుతున్నాయి. లెనిన్ గుణగణాు, త్యాగనిరతి, నిర్మాణదక్షత, సైద్ధాంతిక కృషి, సామ్రాజ్యవాద దశలో పెట్టుబడిదారీ వ్యవస్థలో అంతర్గత వైరుధ్యం, సంపన్న దేశాల్లో విప్లవం రాకముందే ఓ వెనకబడిన దేశంలో విప్లవం సాధించటం, ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ సామ్రాజ్యవాద దశకు చేరుకున్న సమయంలో ఒక దేశంలో సోషలిస్టు ఆర్థిక వ్యవస్థ నిర్మాణం, విశ్వ విప్లవ వ్యూహానికీ వలస దేశాల విముక్తికి మధ్య ఉన్న సంబంధం వంటి అనేక అంశాల గురించి లెనిన్ సాగించిన మేధో మాధానాన్ని ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమం, వామపక్ష శక్తులు మరోసారి మననం చేసుకోనున్నాయి. నిర్దిష్ట పరిస్థితు నిర్దిష్ట అధ్యయనం అన్నది లెనినిజానికి పునాది. ఈ సూత్రాన్ని భౌతిక రాజకీయ పరిస్థితును అధ్యయనం చేయటానికి, అంచనా వేయటానికి రాజకీయ వ్యూహాన్ని రూపొందించటానికి ఉపయోగించిన తీరు గురించి ఎన్నో ఉదాహరణలు చదివాం. తెలుసుకున్నాం. ఈ నిర్దిష్ట పరిస్థితుల నిర్దిష్ట అధ్యయనం సూత్రాన్ని పార్టీ నిర్మాణం, ఎత్తుగడల విషయంలో లెనిన్ ఎలా అము చేశాడో ఈ సందర్భంగా పున:శ్చరణ చేసుకోవటం సమకాలీన విప్లవోద్యమాకు ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నాను.
ఐక్య సంఘటన నిర్మాణం, దానికి కావల్సిన ఎత్తుగడలు లెనినిజం పునాదుల్లో ఓ కీలక భాగం. బోల్షివిక్ విప్లవంలో లెనిన్ జయప్రదంగా అనుసరించిన ఎత్తుగడలే నిర్దిష్ట పరిస్థితులను నిర్దిష్టంగా అధ్యయనం చేయగల ఆయన సామర్ధ్యానికి దర్పణం. ఈ ఎత్తుగడలు పార్టీలో ప్లెఖనోవ్, ట్రాటీస్కీ, ఆక్సెల్రాడ్, మార్టోవ్ వంటి నేతతో ఉన్న భిన్నాభిప్రాయాలను అధిగమించటం మొదలు నాటి వలస దేశాలు (నేటి వర్ధమాన దేశాలు) సోషలిస్టు శిబిరం మధ్య ఉండాల్సిన ఐక్య సంఘటన వరకు విస్తరించాయి. లెనిన్ అనుసరించిన ఐక్య సంఘటనలు నాటి సమకాలీన సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితుల నేపధ్యంలో అనుసరించినవే తప్ప సార్వత్రిక ఎత్తుగడలు కాదు అన్న చారిత్రక వాస్తవాన్ని మనం మర్చిపోరాదు. రష్యా విప్లవోద్యమంలో తలెత్తిన నిర్దిష్ట అవసరాల నేపథ్యంలో వివిధ దశల్లో ఈ ఐక్యసంఘటన ఎత్తుగడలు అమలు జరిగాయి. ఈ ఎత్తుగడల కాలవ్యవధి కూడా ఒకేరీతిగా లేవన్నది వాస్తవం.
సామ్రాజ్యవాద స్వభావాన్ని గుత్తకు తీసుకున్న ద్రవ్య పెట్టుబడిదారీ (ప్రపంచీకరణ) దశలో వివిధ దేశాల్లోనూ ప్రత్యేకించి భారతదేశంలోనూ విప్లవోద్యమం పీడితుల ఐక్య సంఘటన నిర్మాణం దిశగా అడుగు వేస్తున్న తరుణం ఇది. అందువల్లనే లెనిన్ నాయకత్వంలో రష్యన్ సోషల్ డెమొక్రటిక్ లేబర్ పార్టీ (బోల్షివిక్) వివిధ సంధర్భాల్లో అనుసరించిన ఐక్యసంఘటన ఎత్తుగడలను, నాటి వాటి నేపథ్యాన్ని సంక్షిప్తంగా తెలుసుసుకునే ప్రయత్నం ఇది.
నేటికీ పెట్టుబడిదారీ విధానం విశ్వవ్యాప్త విధానంగా ఎదిగినా కొన్ని దేశాలు ప్రజాతంత్ర విప్లవ దశ సాధన దశలోనే ఉండిపోయాయి. ఐక్య సంఘటన ఎత్తుగడ గురించిన గందరగోళం కార్మికవర్గ విప్లవ దశలో ఉన్న దేశాల్లో కంటే ప్రజాతంత్ర విప్లవ దశలో ఉన్న దేశాల్లో ఎక్కువగా ఉంది.
లెనిన్ రచనలను ఔపోసనపట్టిన సమర్ధ నాయకత్వానికి భారత విప్లవోద్యమ ప్రస్థానంలో కొరత ఏమీ లేదు. ఏ రచనను అయినా ఆయా చారిత్రక రాజకీయ నేపథ్యం నుండి చూసినప్పుడు మాత్రమే సదరు రచయిత చెప్పదల్చుకున్న సారం పాఠకులకు అందుతుంది. మనం అధ్యయనం చేసేటప్పుడు ఈ మౌలిక సూత్రాన్ని తరచూ విస్మరిస్తూ ఉంటాము. అందుకే ఒకే పుస్తకంలోని అంచనాలు నిర్ధారణలు ఒక్కొక్కరికి ఒక్కోరంగా అర్థమవుతుంది. ప్రత్యేకించి 19,20 శతాబ్దా నాటి మేధో చర్చను విస్మరిస్తే మార్క్సిజాన్ని మనం అర్థం చేసుకోలేము. అందుకే తొలితరం కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలు ఆధునిక రాజకీయ భూగోళం, చరిత్ర, తత్వశాస్త్ర పరిణామం, అర్థశాస్త్ర పరిణామక్రమం చదువుతూ మార్క్సిజాన్ని అధ్యయనం కాబట్టి సారాన్ని వడపోసి ఆ మార్గదర్శనంలో ఉద్యమాలు నిర్మించగలిగారు.
పెట్టుబడిదారీ వ్యవస్థ సామ్రాజ్యవాద దశలో ప్రవేశించినప్పుడు జార్ చక్రవర్తి కంబంధ హస్తాల నుండి విముక్తి ఉద్యమం సాధించిన పెద్ద విజయమే బోల్షివిక్ విప్లవం. నాటి జారిస్టు రష్యాలోని నిర్దిష్ట పరిస్థితులకు మార్క్సిజాన్ని అన్వయించే ప్రయత్నంలో ఆయన సాగించిన నిర్దిష్ట అధ్యయన సారాంశం ఫలితమే సామ్రాజ్యవాదం పెట్టుబడిదారీ విధానపు అత్యున్నత దశ అన్న రచన. ఈ రచనను పూర్తి చేసే సందర్బంలో వచ్చిందే ప్రపంచ సామ్రాజ్యవాదపు గొలుసులో జారిస్టు రష్యా బహీనమైన లింక్గా ఉందన్న నిర్ధారణ కూడా. ఈ బహీనమైన లింకును తెగ్గొట్టడమే అక్టోబర్ విప్లవానికి జయప్రదానికి మూలం. ఈ కర్తవ్యాన్ని నెరవేర్చేందుకు బోల్షివిక్ పార్టీని సన్నద్ధం చేసే క్రమంలో లెనిన్ దఫదఫాలుగా ఆచరణలో వ్యూహం, ఎత్తుగడలు, నినాదాలు మార్చుకుంటూ వచ్చాడు. కొన్ని సందర్భాల్లో గతంలో తాను పూర్తిగా వ్యతిరేకించిన నినాదాలను, అంచనాలను సైతం విప్లవోద్యమ పురోగమనం ఆవశ్యకత దృష్ట్యా అంగీకరించాడు.
పెట్టుబడిదారీ వ్యవస్థ సామ్రాజ్యవాద దశకు చేరుకున్న సమయంలో ఒక దేశ విప్లవోద్యమం, కార్మికోద్యమంతో పాటు వస దేశా సమస్య, ప్రపంచ కార్మికోద్యమం సమస్యు కూడా కీక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లెనిన్ నాయకత్వంలో అటు అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంలోనూ, దేశీయంగా జారిస్టు రష్యాలోనూ అమలు జరిగిన వ్యూహం, ఎత్తుగడలు, పోరాట రూపాలు, మిత్రులు ` శతృవులను గుర్తించటం, వారి బలాబలా గురించిన అంచనా వంటి వాటన్నింటినీ ఎప్పటికప్పుడు తాజా పర్చుకోవటంలో లెనిన్ అమలు చేసిన సూత్రమే నిర్దిష్ట పరిస్థితు నిర్దిష్ట అధ్యయనం. ప్రధానంగా 1905 నుండి 1917 వరకు లెనిన్ అనుసరించిన ఐక్యసంఘటన ఎత్తుగడలు, రష్యా విప్లవంపైనా, అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమం పైనా, వలస దేశా విముక్తి ఉద్యమాలపైనా వాటి ప్రభావం తెలుసుకోటానికి కొన్ని ఉదాహరణు, కొన్ని చారిత్రక అనుభవాలను పరిశీలిద్దాం.
ప్రజాతంత్ర విప్లవ దశలో ఐక్యసంఘటన ఎత్తుగడలు :
ఏ సమాజంలోనైనా పాలక వర్గం సంఖ్యరీత్యా పరిమితమే. కానీ ఉత్పత్తి సాధనాలు, మార్కెట్పై వీళ్లదే పెత్తనం కావటంతో మొత్తం వ్యవస్థ వీళ్ల చెప్పు చేతల్లో ఉంటుంది, కనుసన్నల్లో నడుస్తుంది. సమాజ స్వభావం మారే కొద్దీ ఈ పరిమిత సంఖ్యలో ఉన్న ఆధిపత్య వర్గం చేతుల్లో నుండి ఉత్పత్తి సాధనాలపై పెత్తనం కొత్త వర్గం చేతుల్లోకి చేరుతుంది. ఈ క్రమంలో ఆధిపత్య స్థానానికి రావాలని కాంక్షించే కొత్త వర్గం విశాల జనబాహుళ్యంతో జట్టు కట్టాల్సిన అవసరం సమాజ పురోగమనంలో తరచూ ముందుకొస్తుంది. భూస్వామ్య వ్యవస్థపై తిరగబడ్డ బూర్జువావర్గం అప్పటి వరకు భూస్వామ్య వర్గం చేతుల్లో నష్టపోయిన వారినందరినీ కూడగట్టిందన్నది ఆధునిక యూరప్ విప్లవాల చరిత్ర. బూర్జువా వర్గం ఓ సారి పాకవర్గంగా అవతరించిన తర్వాత అప్పటి వరకు భూస్వామ్య వ్యవస్థపై పోరాటంలో తనతో జట్టుకట్టిన వారిని కూడా ఉపేక్షించదు. వాళ్లను కూడా దోపిడీ చేస్తుంది. ఈ దోపిడీ క్రమం రానురాను పెట్టుబడిదారీ వ్యవస్థ పరిధిలోనే అనేక ఉత్థానపతనాలతో సాగుతుంది. పెట్టుబడిదారీ వ్యవస్థ పరిధిలో తన పట్టును నిలిపి ఉంచుకునేందుకు జరిగే అన్ని ప్రయత్నాలు, ప్రయోగాకు పూర్తయ్యాక ఓ నూతన దశలోకి ప్రవేశిస్తుంది. సామ్రాజ్యవాదం అటువంటి ఓ నూతన దోపిడీ చట్రం.
సామ్రాజ్యవాదం అంటేనే పీడితులపై సాగే దోపిడీ, దాని తీవ్రత నూతన దశకు చేరటం. దోపిడీ క్రమం నూతన రూపాలు సంతరించుకోవటం. పెట్టుబడి ఆధిపత్యానికి బలయ్యే పీడితుల సంఖ్య కూడా విస్తరించటం. అంటే పెట్టుబడి ఆధిపత్యాన్ని వ్యతిరేకించాల్సిన శక్తుల సంఖ్య, ప్రభావం, సమాజంలో వారి శాతం పెరగటం. కొన్ని కొన్ని సందర్భాల్లో (ప్రత్యేకంగా పెట్టుబడిదారీ సంక్షోభా సమయంలో) చిన్న చిన్న పెట్టుబడిదారులు, మధ్యతరగతి, వ్యాపారస్తులు, (పెటీ బూర్జువా వర్గం) ధనిక రైతాంగం కూడా సామ్రాజ్యవాద దశకు చేరుకున్న గుత్త పెట్టుబడిదారీ ప్రభావానికి దివాళా తీస్తారు.
ఈ పరిణామం (పెట్టుబడిదారీ దోపిడీ కారణంగా నష్టపోయిన ప్రజ సంఖ్య పెరగటం) మరోసారి ప్రజాతంత్ర కూటమి అవసరాన్ని ముందుకు తెస్తుంది. ఈ వాస్తవాన్ని తరచు కమ్యూనిస్తు ఉద్యమం గుర్తించలేకపోతోంది. వీరంతా పెట్టుబడి కారణంగా దివాళా తీస్తున్నారు, నష్టపోతున్నారు కాబట్టి అనివార్యంగా పీడిత తరగతుల్లోనే పీడితులైన కార్మికవర్గ స్వభావాన్ని సంతరించుకుంటారనీ, అందువల్ల కార్మికవర్గ పోరాటాలే ఏకైక లక్ష్యమన్న నిర్ధారణకు వచ్చారు. ఈ విధంగా నష్టపోతున్న వర్గాలు తమ మౌలిక వర్గ స్వభావాన్ని అంత తేలిగ్గా వదులుకోవనీ, సాధ్యమైనంత వరకు దోపిడీ వ్యవ్ణస్థ నిర్మాణంలోనే తమ స్థానాన్ని అంటిపెట్టుకోవడానికి శాయశక్తులా ప్రయత్నం చేస్తారన్న వాస్తవాన్ని గుర్తించాలి. పెట్టుబడి ఆధిపత్యానికి బలై కొత్తగా పీడితు కోవలో చేరే భిన్న సామాజిక తరగతు నిర్దిష్ట పరిస్థితిని గమనించలేని స్థితి పోరాటాలు, విప్లవ నినాదా రూపక్పనలో, తదనుగుణమైన ఎత్తుగడలు రూపొదించటంలో ఒంటెత్తుపోడకలకు దారితీస్తుంది.
ఈరకమైన పొరపాట్లు పునరావృతం కాకుండా ఉండాంటే ప్రజాతంత్ర విప్లవ సమయంలోనే (1905 నాటి విప్లవం) లెనిన్కు, మెన్షివిక్కుకు, సోషలిస్టు రిమ్యాషనరీలకు మధ్య జరిగిన సంవాదాన్ని పరిశీలించాలి. ఈచర్చల్లో లెనిన్ కూడా రివిజనిస్టు అన్న ముద్రను భరించక తప్పింది కాదు. భారత కమ్యూనిస్టు ఉద్యమంలో రివిజనిస్టు ధోరణుల గురించిన చర్చ గణనీయంగానే కనిపిస్తుంది. కానీ కాలక్రమంలో రివిజనిస్టు అన్న పదం భిన్న మార్క్సిస్టు స్రవంతులకు చెందిన వారిని దుయ్యబట్టేందుకు వాడే సాధారణ పదంగా దిగజారింది. విప్లవ పంథాలో పయనించే భిన్న స్రవంతులు కూడా ఒకరికొకరు ఈ ముద్రలు వేసుకున్న సందర్భాలూ చూశాము. పరస్పర సైద్ధాంతిక విబేధాలు తలెత్తిన సందర్బంలో ఇటువంటి చౌకబారు ఆరోపణకు పాల్పడటం భిన్న సైద్ధాంతిక స్రవంతుల మధ్య ఉన్న వ్యత్యాసాలను అర్థం చేసుకోవటానికి ఉపయోగపడకపోగా అపార్థం చేసుకోవటానికి దారితీస్తుంది. నాయకుల ప్రభావంతోనో, వారిమీదున్న నమ్మకం, గౌరవంతోనో ఆ నాయకుడు మరొకరిని రివిజనిస్టు అనో లిక్విడేషనిస్టు అనో ముద్ర వేసినప్పుడు దాన్ని ప్రామాణికంగా భావించటం విప్లవశక్తుల ఐక్యతను, శ్రేణుల మనోధైర్యాన్నీ బహీనపర్చటమే తప్ప మరోటి కాదు. విప్లవోద్యమంలో కార్యకర్తలు, నాయకుల మధ్య నేడున్న గురుతత్వ ధోరణి స్థానంలో గతితార్కిక సంబంధాలు ఉండేలా పార్టీ నిర్మాణాన్ని ఆధునీకరించుకుంటే ఈ పొరపాటు అభిప్రాయాలు విప్లవ పార్టీల్లో సార్వత్రిక భావనలు గా మారకుండా ఉంటాయి.
1905 నాటి బూర్జువా ప్రజాతంత్ర విప్లవం సాధన కోసం ఐక్యసంఘటన ప్రతిపాదించినప్పుడు మెన్షివిక్కు లెనిన్ను రివిజనిస్టుగా ముద్ర వేశారు. బూర్జువా ప్రజాతంత్ర విప్లవంలో కార్మిక వర్గానికి ఎటువంటి పాత్ర ఉండదన్నది వారి అవగాహన. బూర్జువా వర్గమే ఆ కర్తవ్యాన్ని జయప్రదంగా నిర్వహించుకుంటే తదనంతరం ఏర్పడే సమాజంలో ప్రశాంతంగా కార్మికవర్గ రాజకీయాలు నిర్వహించవచ్చన్నది మెన్షివిక్కు సిద్ధాంతం. కాస్త భిన్నమైనది ట్రాట్స్కీ అవగాహన. నిరంతర విప్లవ సాధన క్రమంలో బూర్జువా ప్రజాతంత్ర విప్లవం ఓ తాత్కాలిక మజిలీ మరియు ఒక దేశంలో విప్లవాన్ని జయప్రదం చేటం సాధ్యం కాదు కాబట్టి శాశ్వత విప్లవం కోసమే కృషి చేయాన్నది ఆయన ప్రతిపాదన. ఈ రెండు అవగాహనకంటే భిన్నమైనది లెనిన్ అవగాహన. బూర్జువా ప్రజాతంత్ర విప్లవంలో కార్మికవర్గం భాగస్వామి కావటం ద్వారా దీర్ఘకాంలో బూర్జువా విప్లవంపై కార్మికవర్గం ఆధిపత్యం సంపాదంచటానికి అవకాశం ఉంటుందని లెనిన్ భావించాడు.
ఈ విమర్శకు సమాధానంగా సోషల్ డెమొక్రసీలో రెండు ఎత్తుగడలు అన్న లేఖలో సామ్రాజ్యవాద దశలో ఏ ఒక్కరమూ ప్రజాత్రంత్ర ఉద్యమా నుండి ఒంటరి కాకూడదని హెచ్చరిస్తాడు. బూర్జువాతో సహా సమాజంలోని అన్ని వర్గాలు తరగతులతో ఈ దశలో కార్మికవర్గం సహకరించాలని ప్రతిపాదిస్తాడు. ‘‘ఇక్కడ మనకు మిగలిన వాళ్లకు ఉన్న తేడా ఒక్కటే. ఈ విప్లవోద్యమంలో ఫైట్ టుగెదర్, వాక్ సపరేట్లీ అంటే మనం ఇతర విప్లవకారుతో కలిసి పోరాటాలు నడపాలి, విడివిడిగా మన స్వతంత్ర రాజకీయ పంథాను అము చేయాలి. కానీ మెన్షివిక్కు, సోషలిస్టు రిమ్యాషనరీలు ఈ పోరాటంలో బూర్జువాలు, ఉదారవాదుతో కలిసి నడుస్తారు. ఇదే తేడా’’ అని గుర్తు చేస్తాడు. విశేషమేమంటే ఎత్తుగడకు సంబంధించిన ఈ చర్చంతా కార్మికవర్గ పత్రికల్లోనే జరిగింది. తద్వారా నేరుగా ఈ చర్చల్లో కార్మికవర్గాన్ని భాగస్వామిని చేశాడు.
తన అవగాహనను మరింత పటిష్టరుస్తూ లెనిన్ కార్మికు, రైతాంగం మధ్య ఐక్య సంఘటన ఎత్తుగడను ప్రతిపాదిస్తాడు. ఈ ఐక్యసంఘటన ప్రతిపాదన 1917 నాటి విప్లవం నాటికి పరిపక్వతను సాధించింది. బోల్షిక్ విప్లవాన్ని విజయపథంలో నడిపించింది. ఫ్రాన్స్లో వర్గపోరాటం, పారిస్ కమ్యూన్ను విశ్లేషించేటప్పుడు సూక్ష్మస్థాయిలో మార్క్స్, ఏంగెల్స్లు ఈ ఐక్యసంఘటన ఆవశ్యకతను ప్రతిపాదిస్తే లెనిన్ బోల్షివిక్ విప్లవంలో ఈ ఎత్తుగడకు పరిపూర్ణతను సంతరించి పెట్టాడు.
సామ్రాజ్యవాద, వలసవాద వ్యతిరేక ఐక్యసంఘటన :
బోల్షివిక్ విప్లవం నూతన ప్రపంచాన్ని ఆవిష్కరించింది. సామ్రాజ్యవాద శక్తు ఐక్యసంఘటనలో లింకును తెగ్గొట్టగలిగింది. రష్యాలో కార్మిక కర్షక రాజ్యం ఆవిర్భావంతో పాటు నాటి వలస దేశాల్లో జరుగుతున్న విముక్తి ఉద్యమాలు సామ్రాజ్యవాద శక్తుల ఐక్యసంఘటనను బహీనపర్చటంలో సఫలమయ్యాయి. వలస విముక్తి ఉద్యమాలు ప్రపంచవ్యాపిత స్వభావాన్ని సంతరించుకున్నాయి. సామ్రాజ్యవాదం ప్రపంచ వ్యాప్త శ్రామిక వర్గాన్ని దోపిడీ చేయటమే కాక నేటి వర్ధమాన దేశాల్లో పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ధిని కూడా ఆటంకపర్చింది. అందువల్లనే వలసవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న బూర్జువా ప్రజాతంత్ర విప్లవంలో ఆయా దేశా బూర్జువా వర్గం క్రియాశీల నాయకత్వ పాత్ర పోషించింది. ఈ దిశగా ఐక్యసంఘటన ఎత్తుగడలను అంతర్జాతీయం చేసే ప్రయత్నంలోనే లెనిన్ సాగించిన కృషే మూడో కమ్యూనిస్టు ఇంటర్నేషనల్లో ఏడవ మహాసభలో వలస దేశాల్లో విముక్తి ఉద్యమాల పట్ల తీసుకోవాల్సిన వైఖరి గురించిన సిద్ధాంత చర్చ ఒక కొలిక్కి రావటానికి కారణం. లెనిన్ ప్రతిపాదనతో విబేధిస్తూ ఎం ఎన్ రాయ్ ఓ ప్రత్యామ్నాయ పత్రాన్ని ఈ సమావేశాల్లోనే ప్రతిపాదిస్తాడు. ఈ చర్చలో వలస దేశాల్లోని శ్రామికవర్గ ప్రతినిధులు బూర్జువావర్గ ప్రతినిధుతో కలిసి విముక్తి ఉద్యమాల్లో పాల్గొనాలా లేదా అన్నదే ప్రధానాంశం. దీనికి కొనసాగింపుగానే మన దేశంలో దత్ బ్రాడ్లీ ధీసిస్ను భారత కమ్యూనిస్టు పార్టీ ఆమోదించింది. ఈ ఎత్తుగడలే భారత స్వాతంత్య్రోద్యమంలో కమ్యూనిస్టు పాత్రను విస్తరించటానికి దోహదం చేశాయి.
వలస దేశాల్లో సాగుతున్న విముక్తి ఉద్యమాలు బోల్షివిక్ విప్లవం నుండి స్పూర్తి పొందుతాయి. ఆయా దేశాల్లోని పోరాటానికి నాయకత్వం వహిస్తున్న ప్రముఖులు, నాయకులు బోల్షివిక్ విప్లవానికి సంఫీుభావం ప్రకటించారు. అనేక దేశాల నేతలు సోషలిస్టు రష్యాలో పర్యటిస్తారు. ఈ పరిణామాన్నింటినీ పరిశీలించిన లెనిన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అంతార్జాతీయ ఐక్య కూటమి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని భావించాడు.
కొన్ని వలస దేశాల్లో కమ్యూనిస్టు పార్టీలు తమ శక్తిని ఎక్కువగా అంచనా వేసుకుని ప్రజాతంత్ర విప్లవంతో అవసరం లేకుండా నేరుగా కార్మికవర్గ విప్లవం సాధించగలమన్న పొరపాటు అవగాహనతో ఉండేవి. ఈ అంచనాతో ఉన్న కమ్యూనిస్టు పార్టీలు చిన్న మధ్యతరగతి బూర్జువా వర్గాన్ని కూడా శతృశిబిరంలోకి నెట్టాయి. ఆయా దేశాల్లోని కమ్యూనిస్టు ఉద్యమం, ప్రజా చైతన్యపు నిర్దిష్ట దశతో పాటు దోపిడీ సమాజ నిర్మాణంలో ఉత్పత్తిలో ఆయా వర్గాల స్థానం ఏమిటి, పంపిణీలో వారి వాటా ఏమిటన్నది అధ్యయనం చేయకుండా ఫలానా వర్గం మన విప్లవ వ్యూహంలో ఫలానా స్థానంలో ఉంటుంది కాబట్టీ లేదా వారికి ఊగసలాట ఎక్కువ కాబట్టి తక్షణ స్థితిలో ఎదురయ్యే వారి నిర్దిష్ట డిమాండ్లకు మన విప్లవోద్యమంలో స్థానం లేదని వాదించాయి. ఈ క్రమం అనేక వలస దేశాల్లో కమ్యూనిస్టు ఉద్యమాలు జాతీయ ప్రధాన ఉద్యమ స్రవంతి నుండి వేరుపడి ఒంటరయ్యే పరస్థితిని కల్పించాయి. బూర్జువా ప్రజాతంత్ర విప్లవాల్లో కమ్యూనిస్టు, కార్మికవర్గం ఈ ఉద్యమాల్లో పాల్గొనాన్నది లెనిన్ అవగాహన. తద్వారానే ఆయా దేశాలు భవిష్యత్తులో విప్లవ దశకు చేరుకున్నపుడు ప్రజాతంత్ర విప్లవ దశలో అనుసరించిన ఐక్యసంఘటన ఎత్తుగడల్లో నేర్చుకున్న పాఠాలే పెట్టుబడిగా మారతాయన్నది లెనిన్ ఆశాభావం. అందువ్లనే మూడో ఇంటర్నేషనల్ నాల్గోమహాసభ సందర్భంగా వస దేశాల్లో కమ్యూనిస్టు పార్టీలు స్వతంత్ర వర్గపోరాటా పేరుతో సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రజాతంత్ర శక్తు నాయకత్వంలో జరుగుతున్న పోరాటాల్లో పాుపంచుకోక పోవటం దారుణమైన అవకాశవాదమని విమర్శిస్తాడు.
ఐక్యసంఘటన వ్యూహం ` ఎత్తుగడలు :
ఏపేరుతో పివబడుతున్నా (వసవాదం, సామ్రాజ్యవాదం, ప్రపంచీకరణ, సామ్రాజ్యవాద ప్రపంచీకరణ, ద్రవ్యపెట్టుబడి ప్రపంచీకరణ దశ లాంటి పేర్లు) సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కొనేందుకు కమ్యూనిస్టులు విశాల ప్రాతిపదికన ఐక్యసంఘటన ఎత్తుగడలు అనుసరించాల్సిన పరిస్థితి ఏర్పడినది. ఈ విశాల శక్తులను సమీకరించలేకపోతే సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కోవటంలో కమ్యూనిస్టు కృషి విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా సాగదు. నేటి అనుభవం కూడా ఇదే. అన్ని దేశాల్లోనూ పాలకవర్గ కూటముల్లో సామ్రాజ్యవాదానికి అనుంగు మిత్రు ఉంటారు. ఆయా దేశాల్లో పాలకవర్గ కూటమికి వ్యతిరేకంగా పోరాడేందుకు కూడా కమ్యూనిస్టులకు ఐక్య సంఘటన ఎత్తుగడు అవసరం.
ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ బోల్షివిక్ తరహా విప్లవోద్యమాలు పురివిప్పే అవకాశం ఉందన్న అంచనాల్లోని పొరపాట్లను గుర్తు చేస్తూ లెనిన్ రాసిందే వామపక్ష కమ్యూనిజం : ఓ బాలారిష్టం అన్న రచన. వలస దేశాల్లో ఎత్తుగడలు, వ్యూహానికి సంబంధించిన విషయాల్లో ఈ గ్రంధం ప్రామాణికమైనది. ఐక్యసంఘటన ఎత్తుగడలు, రాజకీయ వ్యూహాలు, కార్మికవర్గ ప్రతినిధుకు పార్లమెంట్లో ప్రవేశించాల్సిన అవరం, ప్రవేశించాక చట్టసభల్లో అనుసరించాల్సిన ఎత్తుగడలు గురించిన చర్చ ఈ రచనలో కనిపిస్తుంది. అప్పుడే పురుడు పోసుకుంటున్న వర్ధమాన దేశాల్లో విప్లవోద్యమం తమ దేశాల్లో కూడా బోల్షివిక్ విప్లవం తరహాలో కార్మిక వర్గ విప్లవానికి సన్నద్ధమవ్వాలన్న పొరపాటు అభిప్రాయాకు గురికావటాన్నే లెనిన్ బాలారిష్టమని విశ్లేషిస్తాడు.
కమ్యూనిస్టు పార్టీలు వర్గపోరాటాల మీద కేంద్రీకరించే క్రమలో సాధారణంగా కొన్ని తప్పుడు అవగాహనతో పొరపాట్లు చేస్తుంటాయని హెచ్చరిస్తాడు. ఈ పొరపాట్లలో ఎన్నికల్లో పాల్గొనరాదని నిర్ణయించటం, బూర్జువా పార్లమెంట్ వేదికల్లో పాలుపంచుకునే ప్రతిపాదను తిరస్కరించటం, ఇతర పార్టీలతో ఏ విధమైన ఐక్యసంఘటనకు సిద్ధం కాకపోవటం, ప్రత్యేకించి బూర్జువా పార్టీలతో ఐక్య సంఘటనకు సుతరామూ తిరస్కరించటం, పార్టీ స్వతంత్రత కాపాడుకోవడమన్న లక్ష్యాన్ని ముందుకు తెచ్చి భావసారూప్యత కలిగిన మిత్రులను సమీకరించుకోవటం పట్ల విముఖత ప్రదర్శించటం, అసలు రాజీ అంటేనే పార్టీని లిక్విడేషనిజం వైపు నడిపించటంగా ప్రచారం చేయటం వంటి పొరపాట్లు తరచు జరుగుతుంటాయని లెనిన్ విశదీకరించాడు.
ఈ పొరపాట్లకు మూలం ఆయా దేశాల్లోని విప్లవోద్యమంలో మొహరించిన శక్తుల, వర్గాల బలాబలాలు, సంకీర్ణ నిర్మాణాల తీరుతెన్నులు, నిర్దిష్ట సమయంలో నిర్దిష్ట వర్గా నిర్దిష్ట డిమాండ్లు, ఈ డిమాండ్ల సాధన కోసం జరిగే పోరాటం విప్లవోద్యమానికి దగ్గరగా తీసుకెళ్తుందా వంటి కీలక విషయాల పట్ల సరైన గతితార్కిక అవగాహన లేకపోవటమే. బోల్షివిక్ తరహా విప్లవం సాధించాలన్న తపనలో అత్యుత్సాహం ప్రదర్శించే పార్టీలు ఒంటెత్తు పోకడలకు ప్పాడతాయని, ఎన్నిక రంగంలో సానుకూ పరిస్థితు ఏర్పడేందుకు అవకాశం ఉన్నా అందులో భాగస్వాములై ఆ పరిస్థితులను కార్మికోద్యమ విప్లవ పంథా దిశగా నడిపించటానికి ప్రయత్నం చేయరన్నది లెనిన్ విమర్శ.
‘‘చారిత్రక పరిణామ క్రమంలో అందుబాటులోకి వచ్చే మధ్యంతర విప్లవ దశల్లో భాగస్వాములు కావటానికి జర్మన్ కమ్యూనిస్టులు అంగీకరించరనీ, ఎకాఎకిన అంతిమ లక్ష్యమైన కార్మికవర్గ విప్లవం కోసం మాత్రమే పని చేస్తార’’న్న ఏంగెల్స్ విమర్శను లెనిన్ వలస దేశాల్లోని కమ్యూనిస్టు పార్టీలకు వర్తింపచేస్తాడు. కార్మికవర్గ విప్లవమే అంతిమ లక్ష్యం కదా అని కూర్చుంటే సదరు లక్ష్యసాధన దిశగా అడుగు ముందుకేయటానికి బదులు మరింత దూరమవుతారని హెచ్చరించాడు.
బూర్జువా పార్టీలతో రాజీ – పోరాటం కమ్యూనిస్టు పార్టీలు అనుసరించాల్సిన ఎత్తుగడ సారమనీ గతితర్కమని లెనిన్ వాదిస్తాడు. విప్లవ సాధన లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో బోల్షివిక్ పార్టీ రాజీ పడ్డ సందర్భాలను కూడా ఆయన వివరిస్తాడు. ఇందులో భాగంగా 1905 విప్లవయత్నం విఫలమయ్యాక 1906 ఏప్రిల్లో జరిగిన రష్యన్ సోషల్ డెమొక్రటిక్ పార్టీ నాల్గో మహాసభలో మెన్షివిక్కు, బోల్షివిక్కు విభాగాలను విలీనం చేయటం ఓ ఉదాహరణగా మనకు కనిపిస్తుంది. ఈ విలీనాన్ని లెనిన్ వ్యక్తిగతంగా వ్యతిరేకించినా మహాసభ విలీనానికే మొగ్గు చూపుతుంది. ఈ మహాసభ గురించి జినోవీవ్ మరో సందర్భలో మాట్లాడుతూ ‘‘దిగువనున్న ప్రజా శ్రేణుల నుండి వచ్చిన ఒత్తిడికి తలొగ్గి ఇరు పక్షాలు విలీనానికి అంగీకరించాయ’’ని చెప్తాడు. తర్వాత జరిగిన డ్యూమా ఎన్నికల్లో పాల్గొనరాదన్న నిర్ణయాన్ని లెనిన్ వ్యతిరేకించినప్పటికీ మెజారిటీ కేంద్ర కమిటీ ఎన్నికల బహిష్కరణకే సుముఖంగా ఉంటుంది. చివరకు తొలి డ్యూమాలో కానిస్టిట్యూషనల్ డెమొక్రటిక్ పార్టీ ప్రధాన శక్తిగా అవతరించటంతో కేంద్ర కమిటీలోని మెన్షివిక్ బృందం తన పొరపాటును అంగీకరిస్తుంది. ఈ విధంగా ప్రతి రాజీ సందర్భం విప్లవ శక్తులకు పాఠం నేర్చుకునే సందర్భమేనని లెనిన్ ఆచరణలో రుజువు చేశాడు. దీన్ని నేటికీ కొన్ని విప్లవ శ్రేణులు గుర్తించటం లేదు. కొన్ని సందర్భాల్లో ఇటువంటి రాజీ కారణంగా ఆరెస్డీఎల్పీ నష్టపోయినా, మెజారిటీ సందర్భాల్లో పురోగమించింది, వర్గ శతృవును బహీనం చేయగలిగింది. పీడిత వర్గాలకు నాయకత్వం వహించి జారిస్టు రష్యాను బోల్షివిక్ రష్యాగా మార్చింది. ఇది లెనిన్ ఎత్తుగడల సాఫల్యత. దాని వెనక ఉన్న నిర్దిష్ట పరిస్థితుల నిర్దిష్ట అధ్యయనం. జర్మనీలో సోషల్ డెమొక్రాట్లు ఇతర ప్రజాతంత్ర శక్తులతో కలిసి పని చేయటానికి నిరాకరించిన సందర్భంలోనూ, ఇంగ్లాండ్లో లేబర్ పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేయటానికి తిరస్కరించిన సందర్భంలోనూ లెనిన్ ఆ పార్టీలను ఘాటుగా విమర్శిస్తాడు. రష్యాలో బోల్షివిక్కులు తీవ్రమైన ఊగిసలాటతో ఉన్న వారితో కూడా కలిసి పని చేశారని గుర్తు చేస్తాడు. జార్ నియంతృత్వానికి వ్యతిరేకంగా శైశవ దశలో ఉన్న రష్యా బూర్జువావర్గంతో రాజీ పడటానికి బోల్షివిక్ పార్టీ ఏనాడూ తిరస్కరించలేదన్న విషయాన్ని కూడా లెనిన్ ప్రస్తావిస్తాడు.
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఐక్య సంఘటన :
సరైన పంథాలో ఐక్య సంఘటన ఎత్తుగడలు అమలు చేసిన అన్ని సందర్భాల్లోనూ, అన్ని దేశాల్లోనూ కమ్యూనిస్టు ఉద్యమం పురోగమించిందని చరిత్ర చెప్తోంది. 1920 దశకం నాటికి మొదలై 30 దశకం నాటికి తీవ్రరూపం దాల్చిన సామ్రాజ్యవాద సంక్షోభం నేపధ్యంలో ప్రపంచ మార్కెట్పై ఆధిపత్యం కొనసాగించేందుకు చేసిన ప్రయత్నాలే ఫాసిజానికి పునాదులు వేశాయి. ఫాసిజం ప్రమాదాన్ని ఎదుర్కోవటానికి అనుసరించాల్సిన ఎత్తుగడ విషయంలో కొమిన్టర్న్లో తీవ్ర భిన్నాభిప్రాయాలు తలెత్తాయి. ఈ పరిస్థితుల్లో లెనిన్ స్పూర్తితో క్లారా జెట్కిన్, టొగ్లియాట్టి, రజనీపామే దత్, డిమిట్రోమ్ ఐక్యసంఘటన వ్యూహం, ఎత్తుగడ ప్రతిపాదను ముందుకు తెచ్చారు. క్లారా జెట్కిన్ మొదలు డిమిట్రోవ్ వరకు కొమిన్టర్న్ మహాసభలు చర్చించిన ఫాసిస్టు వ్యతిరేక ఎత్తుగడలను అధ్యయనం చేయటం ఈ విషయంపై మరింత స్పష్టతనిస్తుంది.
కొమిన్టర్న్ ఆరో మహాసభల్లో జర్మన్ కమ్యూనిస్టు పార్టీ, జర్మన్ సోషల్ డెమొక్రటిక్ పార్టీ మధ్య ఐక్యసంఘటనకు అంగీకారం కుదిరి ఉంటే రాజ్యాంగ సంక్షోభం తలెత్తేది కాదు, జాతీయ సోషలిజం నినాదం పేరుతో హిట్లర్ జర్మనీలో అధికారానికి వచ్చేవాడు కాదు అన్నది వాస్తవం. హిట్లర్ అధికారానికి రావటానికి ముందు ఈ రెండు పార్టీలకు వచ్చిన ఓట్లు సీట్లు కలిపి చూసుకుంటే నాజీ పార్టీకంటే ఎక్కువ ఉన్నాయి. జర్మన్ అనుభవా తర్వాత మిగిలియన యూరోపియన్ దేశాలు ప్రధానంగా ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్లు ఐక్య సంఘటన ఎత్తుగడలను అమలు చేశాయి.
చైనా, వియత్నాం విముక్తి పోరాటాలు ఐక్య సంఘటన ఎత్తుగడల ప్రాధాన్యత గురించి మరిన్ని మలువైన పాఠాలు నేర్పుతున్నాయి. వివిధ దేశాల ప్రత్యేకతలు, ఆయా దేశాల్లో కమ్యూనిస్టు, సోషలిస్టు పార్టీల ఆవిర్భావంలో ముందు వెనకలు, వివిధ దేశాలపై వలసాధిపత్యంలోని వ్యత్యాసాలు, వలస దేశాల్లో రాజ్యాంగ వ్యవస్థల నిర్మాణాలు పరిగణనలోకి తీసుకోకుండా సరళరేఖ వంటి ఎత్తుగడలు సాధ్యమని చెప్పటం ఇక్కడ నా ఉద్దేశ్యం కాదు. భారతదేశంలో కూడా స్వాతంత్య్రోద్యమంలో భాగంగా ఉనికిలోకి వచ్చిన కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ నాయకుల్లో అత్యధికులు తర్వాతి కాలంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ నిర్మాతలయ్యారన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు.
పెట్టుబడిదారీ వ్యవస్థ స్వరూప స్వభావాలు లెనిన్ కాలం నాటికీ నేటికీ చాలా మారాయి. సామ్రాజ్యవాదం కూడా లెనిన్ కాలంతో పోలిస్తే ఆధునిక దోపిడీ రూపాలను ముందుకు తెచ్చింది. అదే విధంగా 1920 దశకంలో ఫాసిస్టు శక్తులు రాజ్యాంగ వ్యవస్థలపై యుద్ధం ప్రకటించి అధికారానికి వస్తే నేటి నయా ఫాసిస్టు శక్తులు తమ అధికార సోపానాలకు ఉదారవాద రాజ్యాంగాలే ఆలంబనగా మారుతున్నాయి. ఉదాహరణకు భారతదేశంలో ఆరెస్సెస్ రాజ్యాంగ బద్ధంగానే దేశాన్ని హిందూరాష్ట్ర గా ప్రకటించే లక్ష్యంతో పని చేస్తోంది. మరికొన్ని దేశాల్లో పాలక వర్గాలు నగ్నంగా నిరంకుశ విధానాలకు ప్పాడుతుంటే రాజ్యంగ వ్యవస్థలు పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ అడపాడదపా అవరోధాలు కల్పిస్తున్నాయి.
నేటి ప్రపంచంలో పెట్టుబడిదారీ వ్యవస్థ ఎంత నాజూకుగా, పారదర్శకంగా కనిపిస్తుందో అంత గాఢమైన దొంతర నడుమ తన దోపిడీని కొనసాగిస్తూ ఉంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా దోపిడీ చట్టాలను చట్రాలను ఆధునీకరిస్తూ వస్తోంది. లెనిన్ నాటికి ప్రపంచ దేశాలపై భౌతికాధిపత్యం కోసం బరితెగించిన ద్రవ్య పెట్టుబడి నేడు ప్రపంచీకరణ దశలో ప్రవేశించి దేశాన్నింటిలోనూ తరతమ స్థాయిల్లో ఉత్పత్తి శక్తుల అభివృద్ధినీ ఉత్పత్తి సంబంధాలనూ నియంత్రిస్తోంది. మరోవైపున మితవాద నయా ఫాసిస్టు శక్తులు పార్లమెంటరీ, పార్లమెంటేతర మార్గాల్లో ఆయాదేశాల సామాజిక రాజకీయ ఆర్థిక సాంస్కృతిక జీవనంపై తమ ఆధిపత్యాన్ని మరింత సంఘటితం చేసుకుంటున్నాయి. భారతదేశంలో జరుగుతున్న పరిణామాలు కూడా ఈ కోవకు చెందినవే.
ఫాసిజం లక్షణాలు వ్యక్తీకరణలు వేర్వేరు దేశాల్లో వేర్వేరు రూపాల్లో కనిపిస్తాయి. అమలవుతాయి. ఆయా దేశాల సాంస్కృతిక వారసత్వం, సామాజిక నిర్మాణాలు, మతాచారాలు, సాంప్రదాయాలు కూడా ఫాసిజానికి ప్రత్యేక లక్షణాలు అద్దటంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ పరిస్థితుల్లో ప్రపంచం ముందు, భారతదేశంలోనూ ముందుకొస్తున్న ఫాసిస్టు శక్తుల పురోగమనాన్ని అడ్డుకునేందుకు కావాల్సిన ఐక్యసంఘటన ఎత్తుగడల విప్లవోద్యమాలను నడిపించటమే లెనిన్ 150వ జయంతి సందర్భంగా మనం అర్పించే నివాళి.