ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకం ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయని, వందశాతం విజయాన్ని అందించిన మండవల్లి మండల నాయకులకు ప్రజలందరికి పేరుపేరునా ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను అని కైకలూరు శాసనసభ్యులు DNR గారు అన్నారు. ఈ మధ్యాహ్నం మండవల్లి మండల జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు అనంతరం స్థానిక క్యాంపు కార్యాలయంలో మండవల్లి మండల అధ్యక్షులు గుమ్మడి వెంకటేశ్వరరావు, ఎంపీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి శ్రీరామదుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో మొత్తం 14 ఎంపీటీసీ స్థానాలకు 8 ఏకగ్రీవంకాగా మిగిలిన 6 స్థానాలకు ఓట్ల లెక్కింపు లో 6 స్థానాలకు 6 కూడా YSRCP విజయం సాధించింది. గెలిచిన ఎంపీటీసీ అభ్యర్థులు MLA గారిని కలిసి గౌరవ ముఖ్యమంత్రి YS జగనన్నకు, MLA DNR గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో MLA, DNR గారు మాట్లాడుతూ మండవల్లి మండల పార్టీ నాయకులకు ప్రత్యేక అభినందనలు అని, గౌరవ ముఖ్యమంత్రి YS జగనన్న పైన నమ్మకంతో మండలంలోని జడ్పీటీసీ ముంగర విజయనిర్మల గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అని, అదేవిదంగా 14 ఎంపీటీసీ స్థానాలు కూడా, ప్రజలు పూర్తిగా మనకి ఇచ్చారు అని అన్నారు, చరిత్రలో ఎప్పుడు ఎవరికీ లేని విజయం ఇచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు, ప్రజలకు పేరు పేరున నా యొక్క ధన్యవాదములు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని అన్నారు. మీరు అందరు మీ మీ గ్రామాలలో కోవిడ్ నిబంధనలు అనుసరించి, మీ యొక్క పనులు చేసుకోవాలని అన్నారు, ఈ కార్యక్రమంలో ముంగర మల్లికార్జునరావు, పెద్దిరెడ్డి శ్రీనివాస్, నారాయణ, బోనం శేషగిరిరావు, బూర్ల భోగేశ్వరరావు, మెండ సురేష్, బేతపూడి రాజు పెద్ద ఎత్తున మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.