కైకలూరు పట్టణంలో ఇంటి స్థలాలు వచ్చిన పేద అక్కచెల్లమ్మలు తక్కువ ఖర్చుతో త్వరగతిన ఇంటి నిర్మాణాలు చేసుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు(DNR) పేర్కొన్నారు. దీనికోసం పక్క నున్న పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి జిల్లాల మేస్త్రీలు,, ఒరిస్సా, ఛతీస్ గడ్, రాష్ట్రాల తాపీ మేస్త్రీలు తక్కువ ధరలకే ఇంటి నిర్మాణాలు చేయడానికి రప్పించాడం జరిగిందని అన్నారు. ఈ సాయంత్రం కైకలూరు పట్టణంలోని YSR జగనన్న గ్రీన్ వీలేజ్ లో మొదటి విడత ఇంటి నిర్మాణాలలో భాగంగా జరుగుతున్న ఇళ్ల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మన కైకలూరు పట్టణంలో అక్కచెల్లమ్మలు అందరు ఒక్కేసారి ఇంటి నిర్మాణాలు చేసుకోవడం వలన మనకి తాపీ మేస్త్రీలు సరిపడా లేక ఇంటి నిర్మాణాలు కుంటుపడిన సంగతి లబ్ధిదారులు నా దృష్టికి తెచ్చిన వెంటనే ఆ సమస్యను అధిగమించేందుకు పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, ఒరిస్సా, ఛతీస్ గడ్, నుంచి మేస్త్రీలను, కూలీలను రప్పించడం జరిగింది అని, వారు YSR జగనన్న గ్రీన్ వీలేజ్ లో ఉండటానికి మేస్త్రీలకు, తాత్కాలిక రేకులు షెడ్లు నిర్మాణానికి అన్ని రకాలుగా ఏర్పాటు చేశాం అని అన్నారు. ఈ రోజు మేస్త్రీలు, కూలీలు ఉండటానికి ఇబ్బందులు లేకుండా వారి కావాల్సిన మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేశాం అన్నారు. రేపటి నుంచి YSR జగనన్న గ్రీన్ వీలేజ్ లో లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలు ఈ యొక్క మేస్త్రీలు పూర్తిగా ప్రారంభిస్తారు అని ఇప్పటికే అడ్వాన్స్ ఇచ్చిన లబ్ధిదారులు ఇండ్లను మార్కింగ్ ఇచ్చి పనులు ప్రారంభించారు అని MLA DNR తెలిపారు.అదేవిదంగా ఇంకా ఎవరైనా ఇంటి నిర్మాణాలు చేసుకునే వారు త్వరగతిన నిర్మాణ పనులు ప్రారంభించాలని MLA DNR గారు అన్నారు.