పాడేరు: ఆనందంతోనే మహమ్మారిని జయించవచ్చంటూ కరోనా రోగులు ఆస్పత్రిలో ఆడిపాడారు. విశాఖ జిల్లా పాడేరు కొవిడ్ ఆస్పత్రిలో గిరిజన నృత్యం, థింసాతో అలరించారు. వైద్యులు సైతం పీపీఈ కిట్లు ధరించి నృత్యం చేసి రోగులను ఉత్తేజపరిచారు. కరోనా వైరస్ సోకిన వారు భయాందోళన చెందకుండా చికిత్స పొందుతూ ఆశావహ దృక్పథంతో ఉంటే త్వరగా కోలుకోవచ్చని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
Courtesy Eenadu