న్యూయార్క్: కరోనా విలయం ప్రపంచమంతటా కొనసాగుతోంది. అగ్రరాజ్యం అమెరికా కరోనా పాజిటివ్ కేసుల్లో ముందంజలో కొనసాగుతోంది. అంతర్జాతీయంగా కోవిడ్-19 సోకిన వారి సంఖ్య 30 లక్షలు దాటగా, అమెరికాలో మిలియన్ మార్క్ అధిగమించింది. తాజా సమాచారం ప్రకారం ఇప్పటివరకు 30,65,756 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అమెరికాలో 10,10,507 మంది కోవిడ్ బారిన పడ్డారు. భారత్లో 30 వేలకు చేరువలో(29,451) కరోనా కేసులు ఉన్నాయి.
కరోనా మహమ్మారి సోకి 2,11,658 మంది మృత్యువాత పడ్డారు. అమెరికాలో కోవిడ్-19 మరణాల సంఖ్య 56,803కు పెరిగింది. ఇటలీలో 26,977, స్పెయిన్లో 23,521, ఫ్రాన్స్లో 23,293, బ్రిన్లో 21,092 మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్లో కరోనా సోకి మరణించిన వారి సంఖ్య వెయ్యిలోపు(939) ఉంది.
కోవిడ్-19 బారిన పడిలో ప్రపంచవ్యాప్తంగా 9,23,046 మంది కోలుకున్నారు. అమెరికాలో 1,39,162, స్పెయిన్లో 1,20,832, జర్మనీలో 114,500, చైనాలో 77,555, ఇరాన్లో 70,933 మంది కరోనా నుంచి బయటపడ్డారు. భారత్లో 7,137 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.