– ప్రకటించిన సీఎం కేసీఆర్
– నేడు నామినేషన్ల దాఖలు
టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఖరారు చేశారు. రాష్ట్రం నుంచి ఖాళీ కాబోతున్న రెండు రాజ్యసభ స్థానాలకుగాను పార్టీ పార్లమెంటరీ నేత కె.కేశవరావు, ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ మాజీ స్పీకర్ కేతిరెడ్డి సురేశ్రెడ్డి పేర్లను ఆయన గురువారం ప్రకటించారు. వారిద్దరూ శుక్రవారం తమ నామినేషన్లను దాఖలు చేయనున్నారు. తమ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినందుకు సీఎం కేసీఆర్కు వారు ధన్యవాదాలు తెలిపారు. వారిని ముఖ్యమంత్రి అభినందించారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు తన్నీరు హరీశ్రావు, కేటీఆర్, శ్రీనివాస్గౌడ్, రాజ్యసభ సభ్యుడు జోగినేపల్లి సంతోశ్కుమార్ తదితరులు కేకేకు, సురరేశ్రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.
Courtesy: NT