ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్లో చోటుచేసుకున్న మూడు వేర్వేరు సంఘటనల్లో 16 మంది వలసకార్మికులు మృతిచెందారు.న్యూఢిల్లీ : రైలు చక్రాల కింద నలిగిపోయిన వలస కూలీల ఘటన మరువకముందే… దేశంలోని అలాంటి విషాద ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. పొట్టచేతపట్టుకొని పట్టణాలకు వలస వెళ్ళిన వలస కార్మికులు.. ఇప్పుడు గ్రామాలకు తిరుగు ప్రయాణమయ్యారు. కాలి బాటన కొందరు… వాహనాల్లో కొందరు… సొంతూళ్ళకు చేరుకునే క్రమంలో ప్రమాదాల రూపంలో వారిని మృత్యువు కబళిస్తున్నది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్లో చోటుచేసుకున్న మూడు వేర్వేరు సంఘటనల్లో 16 మంది వలసకార్మికులు మృతిచెందారు.
యూపీలో కూలీలపై దూసుకెళ్ళిన బస్సు
ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్లో వలస కూలీల మీదుగా బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదం బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగింది. ఈ దారుణ ఘటనలో ఆరుగురు వలసకార్మికులు అక్కడికక్కడే చనిపోగా, ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఢిల్లీ – షహరన్పూర్ జాతీయ రహదారిపై రాత్రి 11 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. వీరంతా బీహార్కు చెందినవారుగా గుర్తించారు. పంజాబ్లో రోజుకూలీలుగా పనిచేస్తున్నవీరంతా లాక్డౌన్ నేపథ్యంలో తమ స్వస్థలాలకు బయలుదేరారు. బస్సు డ్రైవర్పై కేసు నమోదుచేశామనీ, ప్రమాద ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.
మధ్యప్రదేశ్ ఘటనలో 8 మంది
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గునాలో ట్రక్కు బస్సు ఢీ కొన్న ఘటనలో 8 మంది కార్మికులు మరణించారు. 50 మందిదాకా గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్కు చెందిన 60 మంది వలస కార్మికులు ట్రక్కులో ముంబయికి బయలుదేరింది. అహ్మదాబాద్ నుంచి వస్తున్న బస్సు ట్రక్కును ఢ కొట్టినట్టు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. వీరిలో చాలా మంది యూపీలోని ఉన్నావో జిల్లాకు చెందిన కార్మికులని చెప్పారు. గురువారం తెల్లవారుజామున 2.30 గంటలకు ఘటన జరిగిందనీ, గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించినట్టు గున కలెక్టర్ ఎస్ విశ్వనాథన్ చెప్పారు. అలాగే.. బీహార్లో వలసకార్మికులతో వెళుతున్న బస్సు ట్రక్కు ఢీ కొన్న ఘటనలో ఇద్దరు మృతిచెందారు. 12 మంది గాయపడ్డారు. సమస్తీపూర్ జిల్లా శంకర్ చౌక్లో ఈ ఘటన చోటుచేసుకున్నది. గాయపడినవారిని ఢీ కొన్నట్టు పోలీసులు తెలిపారు.
Courtesy Prajasakti