దేశవ్యాప్తంగా 196 మంది మృతి
తెలంగాణలో ఐదుగురు
ఆదుకోవాలని ప్రధానికి ఐఎంఏ లేఖ
దిల్లీ: కొవిడ్ రోగులకు చికిత్సలు చేస్తూ దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో 196 మంది వైద్యులు మృతిచెందినట్లు భారత వైద్య సంఘం (ఐఎమ్ఏ) ప్రకటించింది. వీరిలో ఆంధ్రప్రదేశ్లో 12 మంది, తెలంగాణలో ఐదుగురు ఉన్నట్లు వెల్లడించింది. అత్యధికంగా తమిళనాడులో 43 మంది కన్నుమూసినట్లు పేర్కొంది. వైద్యుల భద్రత ప్రమాదకరంగా మారుతున్నందున ప్రధాని జోక్యం చేసుకోవాలని కోరింది. ఈ మేరకు ఐఎంఏ అధ్యక్షుడు రంజన్శర్మ, గౌరవ సెక్రటరీ జనరల్ ఆర్వీ అశోకన్ ప్రధాని మోదీకి లేఖ రాశారు.
తెలంగాణలో కన్నుమూసినవారు
జ్ఞానేశ్వర్రావు, హరికుమార్, కేవీఆర్ ప్రసాద్ (హైదరాబాద్) నళినీకాంత్ (ఆర్మూర్), ఆయూబ్ఖాన్(వరంగల్)
Courtesy Eenadu