- రోహిత్, వినేశ్, రాణి, మనికా, తంగవేలుకు ఖేల్రత్న
- సాత్విక్ సహా 27 మందికి అర్జున
- సాక్షి, మీరాబాయికి నిరాశ
న్యూఢిల్లీ: ఊహించినట్టే.. ఈసారి ఐదుగురికి అత్యున్నత క్రీడా పుర స్కారం రాజీవ్ ఖేల్రత్న దక్కింది. ఇదివరకే ఖరారైన జాబితా ప్రకారం.. క్రికెటర్ రోహిత్ శర్మ, పారాలింపిక్ స్వర్ణ పతక విజేత మరియప్పన్ తంగ వేలు, మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగట్, టేబుల్ టెన్నిస్ స్టార్ మనికా బాత్రా, మహిళల హాకీ జట్టు కెప్టెన్ రాణీ రాంపాల్ ఖేల్రత్న పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ జాబితాకు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం అధికారికంగా ఆమోదముద్ర వేసింది. అయితే, అర్జున అవార్డుల జాబితాను కమిటీ ఎంపిక చేసిన 29 మందికి కాకుండా జాబితాను 27 మందికి ప్రభుత్వం కుదించింది. గతంలో ఖేల్రత్న అవార్డు అందుకున్న వారికి తాజాగా అర్జున ఇవ్వరాదని క్రీడాశాఖ నిర్ణయించింది. దీంతో అర్జున రేసులో నిలిచిన రెజ్లర్ సాక్షి మాలిక్, వెయి ట్లిఫ్టర్ మీరాబాయి చానుకు నిరాశ ఎదురైంది. సాక్షి 2016లో, చాను 2018లో ఖేల్రత్న అందుకున్నారు. అర్జున అందుకోనున్న వారిలో తెలుగు షట్లర్ సాత్విక్ సాయిరాజ్, ఒడిశా స్ర్పింటర్ ద్యూతీచంద్ ఉన్నారు. ద్రోణా చార్య అవార్డును రెగ్యులర్ కింద ఐదుగురు, లైఫ్టైమ్ విభాగంలో 8 మంది, ధ్యాన్చంద్ అవార్డులను 15 మంది అందుకోనున్నారు. ఏపీకి చెందిన మహిళా బాక్సింగ్ కోచ్ ఉష ధ్యాన్చంద్ అవార్డుకు ఎంపికైంది.
Courtesy Andhrajyothi