-మంథని
తన తండ్రి పేరు మీద ఉన్న భూమిని తల్లి పేరు మీదకు మార్చాలని అడిగితే తనపై వీఆర్ఓ కారంపొడితో దాడి చేశారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా మంథని మండలం నాగేపల్లిలో జరిగింది. బాధితురాలు సమ్మక్క తెలిపిన వివరాల ప్రకారం.. నాగేపల్లి గ్రామానికి చెందిన ఇందరపు సమ్మక్క తండ్రి చనిపోయిన తర్వాత ఆ భూమిని తల్లి పేరు మీద చేయాలని సంవత్సరం నుంచి వీఆర్ఓ చుట్టూ తిరుగుతోంది. అందుకోసం వీఆర్వో హసీనాబాకు ఇప్పటికే రూ.30వేలు ఇచ్చింది. అయినా పనికాకపోగా మరిన్ని డబ్బులు డిమాండ్ చేసింది. గురువారం వీఆర్వో ఇంటికి వెళ్లి నిలదీయగా, కారంపొడితో దాడి చేశారు. ఈ ఘటనపై వీఆర్వోపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు మంథని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదైంది.
Courtesy Navatelangana…