– వాసిలి సురేష్
టిక్టాక్ వచ్చి నప్పటినుంచీ ‘చాలెంజ్’లు ఎక్కువై పోతున్నాయి. అందులో కొన్ని మంచివి ఉంటున్నా, కొన్ని మాత్రం చెడు చేసే చాలెంజ్లు వస్తున్నాయి. రన్నింగ్ కారు నుంచి దిగి నెమ్మదిగా కదులుతున్న ఆ కారు పక్కన డ్యాన్స్ చేసి మళ్లీ కారెక్కే ‘రన్నింగ్ మ్యాన్’ చాలెంజ్? చాలా రోజుల క్రితం వచ్చింది. దాని వల్ల చాలా మంది యాక్సిడెంట్ల బారిన పడ్డారు. ఆ తర్వాత ఈ మధ్య కొత్తగా ఒకరి నోట్లోని సిరీల్స్ను తీసుకుని తినే ‘సిరీల్’ చాలెంజ్ వచ్చింది.
ఇలాంటి పిచ్చి చాలెంజ్లు ఈ మధ్య ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు తాజాగా మన శరీరంలోని ఎముకలను విరగకుట్టుకునే మరొక చెత్త చాలెంజ్ ఇటీవలి కాలంలో టిక్టాక్లో వైరల్ అవుతోంది. ఇలా కొత్త కొత్త వీడియో గేమ్లే కాకుండా, టిక్ టాక్ లాంటి వాటిల్లో వెల్లువెత్తున్న ఛాలెంజ్లు ప్రజ ల ప్రాణాలు తీస్తున్నాయి. ముఖ్యంగా యువత వీటికి ఇట్టే ఆకర్షితులైపోతున్నారు. ఫలితంగా తెలిసీ తెలియని వయసులో ఛాలెంజ్ల పేరుతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
ఇంతకీ ఆ చాలెంజ్ ఏమిటి..? డాక్టర్లు దీ ని గురించి చేస్తున్న హెచ్చరిక ఏమిటో నేడు సోషల్ మీడియాతో నిత్యం గడుపుతున్న యు వతతోపాటు, అందరూ తెల్సుకోవాలి. ఈ ఛా లెంజ్ పేరు ‘స్కల్ బ్రేకర్ ఛాలెంజ్’. ఆ ఛాలెంజ్ పేరులోనే తెలుస్తున్నది. ఇది ప్రాణాల మీదకు తెచ్చే ఆట అని. ఇప్పుడు ఈ ఆట ప్రపంచ వ్యాప్తంగా వైరల్గా మారింది. స్కల్ బ్రేకర్ ఛాలెంజ్ అంటే ముగ్గురు వ్యక్తులు నిల్చుం టారు. అందులో ఇద్దరు వ్యక్తులు గాలిలో ఎగురుతుండగా, మూడో వ్యక్తి వారి మధ్యలో నిల్చుని అలాగే చేస్తుంటాడు. మధ్యలో వ్యక్తి పైకి ఎగిరినపుడు అతడి కాళ్లపై మిగిలిన ఇద్దరూ తన్నడం ఈ గేమ్ ప్రత్యేకత. మధ్యలో వ్యక్తి పైకి ఎగిరినపుడు కింద పడేలా తన్నడం చేయాలి. అంటే మధ్యలో నిలబడి ఉన్న వ్యక్తి ఎగిరిన సమయంలో వాళ్లు ఎగరకుండా చెరో కాలితో మధ్యలో ఉన్న వ్యక్తి కాళ్లను ముందుకు తన్నడంతో అతడు వెల్లకిలా పడిపోతాడు. ఫలితంగా భారం అంతా నడుం, వెన్నుపూస, తలపై పడుతుంది. ఈ ఆట ప్రాణాంతకం. వెన్నెముక దెబ్బతిన్నా, తలకు గట్టిగా దెబ్బ తగి లినా, మనిషి లేవలేడని వైద్యులు చెబుతు న్నారు. ఈ కిల్లింగ్ గేమ్ వైరల్గా మారుతు న్నది. యువత ఈ ఛాలెంజ్ మత్తులో కూరుకుపోయారు. గతంలో కూడా సిన్నామన్ ఛాలెంజ్, టైడ్ పాడ్ ఛాలెంజ్, కైలీ జెన్నర్ లిప్ ఛాలెంజ్ వంటి హానికరమైన ఛాలెంజ్లలో కూడా యువకులు పాల్గొన్నారు. తాజాగా వెనిజులా దేశంలోని స్కూల్ విద్యార్థులు స్కల్ బ్రేకర్ ఛాలెంజ్లో పాల్గొనడం వల్ల ఒక బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఛాలెంజ్ వీడియో చేయడం వల్ల తలకు గాయాలై బాలుడిని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేర్పించి నట్టు ఒక పత్రిక తన కథనంలో తెలిపింది. ఆ ఛాలెంజ్ వీడియో వైరల్ అయ్యింది. ఛాలెం జ్లో పాల్గొన్న ముగ్గురు స్కూల్ విద్యార్థులపై యాజమాన్యం చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. ఇలాంటి ఛాలెంజ్ల్లో పాల్గొనేవారికి తీవ్రమైన గాయాలు కావడంతోపాటు ప్రాణాలు కూడా పోయే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియాలో చాలా మంది ఈ ప్రమాదకరమైన వీడియోలను షేర్ చేస్తున్నారు. ప్రజలు, ముఖ్యంగా యువకులు ఇందులో పాల్గొనకుండా ఉండాలని నిపుణులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంతకు ముందు బ్లూ వేల్, మోమో ఛాలెంజ్లని యువత ఈ స్టంట్లు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. హింసాపూరితమైన వీడియో గేములు, ఛాలెంజ్ల బారిన పడకుండా నేటి యువత స్వీయ నియంత్రణ అలవర్చుకోవాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యా సంస్థల యాజమాన్యాలు తమ పరిధిలో విద్యార్థులను గమనిస్తూ వీటి బారిన పడకుండా మార్గ నిర్దేశనం చేయాలి.
సెల్ : 9494615360