షాద్నగర్: హైదరాబాద్లోని షాద్నగర్లో చటాన్పల్లి వంతెన వద్ద ప్రియాంకరెడ్డి(22) అనే యువతిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. అనంతరం పెట్రోల్ పోసి నిప్పంటించారు. అయితే అక్కడి రోడ్డు బ్రిడ్జి కింద ఓ యువతి మృతదేహం ఉందని సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. టీవీలో ఓ మృతదేహం గురించి వార్త చూసిన ప్రియాంకారెడ్డి తండ్రి శ్రీధర్ రెడ్డి ఈ రోజు ఘటనాస్థలి వద్దకు వెళ్లి, అది తన కూతురిదేనని గుర్తించారు. వారి కుటుంబం శంషాబాద్ లో నివసిస్తోంది. ఆమె మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట్ మండలం కొల్లూర్ గ్రామంలో ఆమె వెటర్నరీ వైద్యురాలని పోలీసులు చెప్పారు. నిన్న విధులకు వెళ్లి ఆమె తిరిగిరాలేదు.
Courtesy Prajasakthi