కేంద్రానికి రూ.1.76 లక్షల కోట్లు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

బదిలీకి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆమోదం

ఇదివరకెన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) నుంచి కేంద్ర ప్రభుత్వానికి నిధుల బదిలీకి రంగం సిద్ధమైంది. ఆర్‌బీఐ గత గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌కు, మోదీ ప్రభుత్వానికి మధ్య ఈ నిధుల విషయంలోనే తీవ్ర అభిప్రాయభేదాలు తలెత్తి.. చివరకు అది ఉర్జిత్‌ రాజీనామాకూ దారితీసిన విషయం గుర్తుండే ఉంటుంది. అయితే ఆ తర్వాత ఉర్జిత్‌ స్థానంలో వచ్చిన శక్తికాంత దాస్‌ నేతృత్వంలోని ఆర్‌బీఐ బోర్డు.. అదనపు నిధుల విషయంలో సమీక్ష చేయడానికి కమిటీ ఏర్పాటుకు అంగీకారం తెలిపింది. బిమల్‌ జలాన్‌ నేతృత్వంలోని ఆ కమిటీ సిఫారసుల మేరకే తాజాగా సోమవారం జరిగిన ఆర్‌బీఐ బోర్డు సమావేశంలో ఈ నిధుల బదిలీకి ఆమోదం లభించింది. దీంతో ఆర్‌బీఐ నుంచి కేంద్రానికి రూ.1,76,051 కోట్ల అ‘ధనం’ బదిలీ కావడానికి మార్గం సుగమం అయింది. ఆర్థిక వ్యవస్థ మందగమనం పాలైన ఈ తరుణంలో ప్రభుత్వం మరిన్ని ప్రోత్సాహకాలు ప్రకటించడానికి ఈ నిధులు వీలు కల్పించే అవకాశం ఉంది.

 

(Courtacy Eenadu)

RELATED ARTICLES

Latest Updates