న్యూఢిల్లీ : జమ్ముకాశ్మీర్కు చెందిన ముగ్గురు ఫొటోగ్రాఫర్లకు ప్రతిష్టాత్మక పులిట్జర్-2020 అవార్డు సంయుక్తంగా లభించింది. శ్రీనగర్కు చెందిన దార్ యాసిన్, ముక్తర్ ఖాన్, జమ్ము జిల్లాకు చెందిన చాని ఆనంద్ అంతర్జాతీయ వార్తా సంస్థ ‘అసోసియేటెడ్ ప్రెస్’కు పని చేస్తున్నారు. గత ఏడాది కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, ఆ తదుపరి పరిణామాలపై వీరు ముగ్గురూ ప్రాణాలకు తెగించి తమ కెమెరాల్లో బంధించిన చిత్రాలను ప్రపంచం ముందుంచారు. దీంతో, ఫొటో జర్నలిజంలో ఫీచర్స్ విభాగానికి గాను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ‘పులిట్జర్-2020’ అవార్డు ఈ ముగ్గురినీ వరించింది. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ”ఈ పరిస్థితి మౌనంగా ఉండేది కాదు, అందుకే అసాధ్యమైనప్పటికీ దాన్ని అధిగమించి మా బాధ్యత నెరవేర్చాం” అని అన్నారు. పులిట్జర్ విజేతలను కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ, జమ్ముకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ట్విట్టర్లో అభినందించారు. న్యూయార్క్లోని కొలంబియా యూనివర్శిటీ నుంచి పులిట్జర్ ప్రైజ్ బోర్డు అడ్మినిస్ట్రేటర్ డానా కెనడీ విజేతలను యుట్యూబ్ లైవ్స్టీమ్లో సోమవారం రాత్రి ప్రకటించారు.
Courtesy: NT