- ట్విటర్, ఎఫ్బీల్లో పోస్టుల తొలగింపు
- నేడు పలువురిపై కేసులు పెట్టే చాన్స్
- ఏబీఎన్ బ్యూరోచీఫ్ ట్వీట్కు స్పందన
హైదరాబాద్: వెటర్నరీ వైద్యురాలి హత్యాచార ఉదంతం తర్వాత కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో.. ఆమెను కించపరుస్తూ అసభ్య పోస్టులు పెట్టారు. నిందితులకు మద్దతుగా పోస్టులు చేశారు. ఇంకొందరు డాక్టర్ ఫొటోను పోస్టు చేసి.. ‘‘రేపిస్టులు లక్కీ’’ అంటూ అసభ్య పదజాలాన్ని ప్రయోగించారు. దీనిపై ఏబీఎన్-ఆంధ్రజ్యోతి బ్యూరోచీఫ్ కవిత తీవ్రంగా స్పందించారు. ఆ పోస్టులను అటాచ్ చేస్తూ.. ‘‘కొన్ని గలీజు మెదళ్లు డాక్టర్ విషయంలో చెత్తగా మాట్లాడుతున్నాయి’’ అంటూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్కు తెలంగాణ డీజీపీ, రాచకొండ, హైదరాబాద్ పోలీసులను ట్యాగ్ చేశారు. దీనిపై హైదరాబాద్ పోలీసులు స్పందించారు. వెంటనే కొన్ని అసభ్య ట్వీట్లు, ఫేస్బుక్ పోస్టులను తొలగించేలా చర్యలు తీసుకున్నారు. సైబర్క్రైమ్ పోలీ్సస్టేషన్ సిబ్బంది ట్విటర్, ఫేస్బుక్లో నిందితుల వివరాలను సేకరిస్తున్నారు. శనివారం కొందరిపై కేసులు నమోదు చేస్తామని ఓ అధికారి ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు.
Courtesy AndhraJyothy…