హైదరాబాద్: బీసీ జాతీయ మహాసభ ఆగస్టు 7న నిర్వహిస్తామని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ తెలిపారు. బీసీ జాతీయ మహాసభను ఆన్లైన్ ద్వారా వర్చువల్ పద్ధతిలో నిర్వహించనున్నట్టు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
29 రాష్ట్రాలకు చెందిన బీసీ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారని చెప్పారు. మహారాషష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, డీఎంకే పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్లను ముఖ్య అతిథులుగా ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు సాధించడమే ధ్యేయంగా ఈ జాతీయ మహాసభ నిర్వహిస్తున్నామని శ్రీనివాస్గౌడ్ ప్రకటించారు. ఈ సభను విజయవంతం చేయాలని బీసీలకు ఆయన పిలుపునిచ్చారు.