హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ప్రకటన
హైదరాబాద్ : లాక్డౌన్ కారణంగా ప్రస్తుతం న్యాయస్థానాల్లో కార్యకలాపాలు స్తంభించిన నేపథ్యంలో కోర్టుల వేసవి సెలవులను రద్దు చేస్తున్నట్లు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఒక ప్రకటనలో తెలిపారు. హైకోర్టు, హైకోర్టు పరిధిలో పనిచేసే అన్ని ట్రిబ్యునళ్లు, జిల్లా, సబ్ కోర్టులు, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ, హైకోర్టు న్యాయసేవాధికార సంస్థ, జ్యుడీషియల్ అకాడమీ, మీడియేషన్ అండ్ ఆర్బిట్రేషన్ కేంద్రాలకు వేసవి సెలవులను రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
Courtesy Andhrajyothi