నీరో చక్రవర్తిని మరిపించిన కోవింద్, మోడీలు..

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

ట్వీట్‌ చేసిన ప్రముఖ విశ్లేషకుడు మైఖేల్‌

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ హింసాకాండతో అట్టుడుకుతుంటే రాష్ట్రపతి, ప్రధాని రామ్‌నాథ్‌ కోవింద్‌, మోడీలు నీరో చక్రవర్తిని మరిపించారని పలువురు విమర్శి స్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు విందు భోజనం ఏర్పాటు చేయడంలో మునిగిపోయారని, దీంతో రోమ్‌ నగరం తగలబడుతుంటే ఫిడేలు వాయించిన నీరో చక్రవర్తిని వారు గుర్తుకు తెచ్చారని అన్నారు. హోంమంత్రి అమిత్‌ షా కూడా ఒక అధికారి ద్వారా ప్రకటన జారీ చేయడం గమనార్హం. దీనిపై స్పందించిన దక్షిణ ఆసియా విశ్లేషకుడు మైఖేల్‌ కుగెల్మాన్‌ ఒక ట్వీట్‌ చేశారు. ”ఇటువంటి ఘర్షణ వాతా వరణం నెలకొన్న సమయంలో శాంతికి పిలుపునివ్వాల్సిన ప్రభుత్వం మౌనం పాటించడం శోచనీయం” అన్నారు.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates