చెన్నై: కొత్తగా వ్యాపారం ప్రారంభించిన వారు తక్కువ ధరకే వస్తువులను విక్రయించడం సర్వ సాధారణం. ఈ వ్యూహం మాంసం ఉత్పత్తులకు కూడా పనికొస్తుందని తమిళనాడుకుకు చెందిన వ్యాపారి ఒకరు నిరూపించారు. శివగంగ జిల్లా కరైకుడికి చెందిన ఓ వ్యాపారి చేపల విక్రయ కేంద్రాన్ని కొత్తగా ఏర్పాటు చేశాడు. తన దగ్గరకు వచ్చిన తొలి వంద మందికి కేవలం రూ.1కే కిలో చేపలు అమ్ముతానని ప్రచారం చేశాడు. దీంతో చేపలు కొనడానికి ఉదయం ఆరు గంటలకే ప్రజలు దుకాణం ముందు బారులు తీరారు. తొలి వంద మందికే చేపలు దక్కినప్పటికీ తనకు విస్తృత ప్రచారం లభించిందని వ్యాపారి సంతోషం వ్యక్తంచేస్తున్నాడు. రూపాయికే ఇడ్లీ విక్రయిస్తున్న బామ్మే తనకు స్ఫూర్తి అని సదరు వ్యాపారి చెప్పుకొచ్చాడు.
Courtesy Eenadu…