1.76 లక్షల కోట్ల నష్టం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

-మూడేండ్లలో నిరర్థక ఆస్తుల దెబ్బకు కుదేలైన బ్యాంకులు
-రూ.100 కోట్ల కంటే అధిక మొండి బకాయిదారులు 416
-పెద్ద నోట్ల రద్దు తర్వాత భారీగా రైద్దెన రుణాలు : ఆర్బీఐ వెల్లడి

ముంబై, అక్టోబర్ 10: ఆర్థిక మందగమనంలో కొనసాగుతున్న దేశ ఆర్థిక వ్యవస్థకు మరో చేదువార్త. కుప్పల్లా పెరిగిపోతున్న నిరర్థక ఆస్తుల దెబ్బకు ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు కుదేలవుతున్నాయి. పెద్ద నోట్ల రద్దు చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు దేశీయ బ్యాంకింగ్ రంగ సంస్థలకు అక్షరాల రూ.1.76 లక్షల కోట్ల నష్టం వాటిళ్లింది. 2014-15 నుంచి ఆయా సంస్థల నుంచి రూ.100 కోట్లకు పైగా రుణాలను తీసుకొని ఎగ్గొట్టిన 416 మంది మొండి బకాయిలదారులు చెల్లించాల్సిన మొత్తం ఇది. సరాసరిగా ఒక్కోక్కరు రూ.424 కోట్లకు పైగా రుణాలు చెల్లించాల్సి ఉంది.

ద్రవ్యలోటుతో సతమతమవుతున్న కేంద్ర ప్రభుత్వానికి రిజర్వు బ్యాంక్ అందించనున్న రూ.1.76 లక్షల కోట్లకు ఇది సమానం. సమాచార హక్కు చట్టం ప్రకారం రిజర్వు బ్యాంక్‌ను అడిగిన ప్రశ్నకు ఈ విషయం వెల్లడైంది. 2015 నుంచి 2018 మధ్యకాలంలో ప్రభుత్వ, ప్రైవేట్, కమర్షియల్ బ్యాంకులు నికరంగా నష్టపోయింది రూ.2.17 లక్షల కోట్లు. వీటిలో తొలి ఏడాది 109 మంది రుణ గ్రహీతలకు చెందిన రూ.40,798 కోట్ల రుణాలను రద్దుచేసిన ప్రభుత్వరంగ బ్యాంకులు.. మార్చి 31, 2016 నాటికి 199 మంది మొండి బకాయిదారులకు సంబంధించిన రూ.69,976 కోట్లు రద్దు చేశాయి. భారీగా రుణాలను రద్దు చేస్తున్నప్పటికీ బ్యాంకింగ్ వ్యవస్థలో మొండి బకాయిలు మాత్రం తగ్గడం లేదు. ఏడాది ఏడాదికి అంతకు పెరుగుతున్నాయి.

నోట్ల రద్దు తర్వాత పెరిగిన మొండి బకాయిలు ల్లధనాన్ని నిర్మూలించాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ పెద్ద నోట్లను రద్దు చేస్తు తీసుకున్న నిర్ణయం మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపింది.. ఇదే సమయంలో మొండి బకాయిలు అంతకంతకు పెరిగాయి. అంతకుముందు 343 మొండి బకాయిదారులు ఉండగా, ఆ తర్వాత మరో 144 మంది జతయ్యారు. పెద్ద నోట్ల రద్దు చేసిన నాటికంటే ముందు రూ.69,926 కోట్లుగా ఉన్న రుణాల రద్దు ఆ తర్వాత ఏకంగా రూ.1,27,797 కోట్లకు పెరిగాయి. అంటే నికరంగా రూ.57,821 కోట్లు పెరిగినట్లు అయ్యాయి. మార్చి 31, 2018 నాటికి రుణాలు తీసుకొన్ని ఎగ్గొట్టిన వారి సంఖ్య 525కి చేరారు. ఇదే సమయంలో మొండి బకాయిలు రూ.1.27 లక్షల కోట్ల నుంచి రూ.2.17 లక్షల కోట్లకు చేరుకున్నాయి. సెప్టెంబర్ 2014 కంటే ముందువున్న మొండి బకాయిల వివరాలు మాత్రం సెంట్రల్ బ్యాంక్ వెల్లడించలేదు.

తిరిగి వసూలు చేసింది స్వల్పమే.. కొండను తవ్వి ఎలుకను పట్టుకున్నట్లు ఉన్నది బ్యాంకుల వ్యవహారం. కార్పొరేట్ సంస్థలకు వేలాది కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చి తిరిగి వసూలు చేయడంలో మాత్రం విఫలమయ్యాయి. కేవలం 15-20 శాతం వరకు మాత్రమే రుణాలను రికవరీ చేసినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆర్థిక మందగమన పరిస్థితుల నేపథ్యంలో రుణాలు తీసుకున్న వారు తిరిగి కట్టలేక చేతులెత్తేసిన వారి నుంచి రుణాలను వసూలు చేయడానికి ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసుకున్నప్పటికీ నిరాశే మిగిలింది.

Courteesy Namasthe Telangana

RELATED ARTICLES

Latest Updates