హైదరాబాద్ సిటీ : లాక్డౌన్ సమయంలో వలస కార్మికులు, గూడులేని నిరుపేదల సంరక్షణ కోసం ఇంతవరకు ఎన్ని షెల్టర్ హోమ్స్ ఏర్పాటు చేశారు? వాటి సామర్థ్యం ఎంత? తదితర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ సర్కారును హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించింది. వలస కూలీలు, బిచ్చగాళ్లు ఇంకా పుట్పాత్లపైనే తింటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ న్యాయవాది ఎస్. నంద హైకోర్టు సీజేకు లేఖ రాశారు. ఈ లేఖను హైకోర్టు సుమోటో పిల్గా స్వీకరించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ అభిషేక్ రెడ్డితో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. కాగా, జంటనగరాల్లోని సంరక్షణ కేంద్రాల్లో పిల్లలను, వలస కార్మికులను ఆదుకునేందుకు వస్తున్న ఎన్జీవోలను, స్వచ్ఛంద సేవకులను ఎందుకు అనుమతించడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై మే 6వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
Coutesy Andhrajyothi