పట్నా : ప్రైవేటు వైద్య కళాశాల ఆస్పత్రిలోని కరోనా ఐసోలేషన్ వార్డులో చేరిన మహిళపై ఓ వైద్యుడు అత్యాచారం చేయడంతో ఆమె మృతిచెందింది. ఈ దారుణం బిహార్లోని గయలో చోటుచేసుకుంది. మృతురాలి స్వస్థలం పంజాబ్లోని లుథియానా. గత నెల 25న భర్తతో కలిసి గయ వచ్చింది. లుథియానాలో ఉండగా రెండో నెలలో ఆమెకు గర్భస్రావం అయింది. గయ వచ్చిన రెండు రోజులకు ఆమెకు రక్తస్రావం కావడంతో అనుగ్రహ్ నారాయణ మగధ్ వైద్య కళాశాల ఆస్పత్రిలో చేర్పించాడు భర్త.
ఈ నెల 1న ఆమెలో కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయంటూ ఐసోలేషన్ వార్డుకు తరలించారు. అక్కడ ఆమెపై ఓ వైద్యుడు వరుసగా రెండు రోజులు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమెకు కరోనా వైరస్ సోకలేదని వైద్య పరీక్షల్లో తేలడంతో 4న డిశ్చార్జి చేశారు. 6న ఆమెకు మళ్లీ తీవ్ర రక్తస్రావం కావడంతో ఆస్పత్రికి తీసుకొచ్చారు. చికిత్స పొందుతూ ఆమె మృతిచెందింది. ఆమె మరణించాక వైద్యుడి అమానుషాన్ని బంధువులు బయటపెట్టారు.
Courtesy Andhrajyothi