కరోనాపై ముదిమి జంట విజయం
కొట్టాయం : కేవలం 50, 60 ఏళ్ల వయసులో ఉన్నవారు కూడా కరోనా బారిన చిక్కితే మరణించడం చూస్తున్నాం. కానీ.. 90ల వయసులో ఉండీ కరోనా కోరల నుంచి బతికి బట్టకట్టిన ఒక కేరళ జంటను చూసి వైద్యులు నోరెళ్లబెడుతున్నారు. వైద్యశాస్త్రంలో ఇదొక అద్భుతమంటూ కొనియాడుతున్నారు. కేరళలోని పతనంథిట్ట జిల్లాకు చెందిన థామస్ అబ్రహాం(93)ను, అతడి భార్య మరియమ్మ(88)కు ఇటలీ వెళ్లి వచ్చిన తనయుడు, కోడలు, మనవడి నుంచి కరోనా సోకింది. చికిత్సకై గత నెల 9న ఆస్పత్రిలో చేరారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. ఇద్దరూ చాలా త్వరితంగా కోలుకున్నారు. వైద్యులు వారిని శుక్రవారం డిశ్చార్జి చేశారు.
Courtesy Andhrajyothi