- తండ్రికి విజయారెడ్డి పిల్లల ప్రశ్న
- ‘బైబై’ చెప్పి తమను బడికి పంపిన అమ్మ.. ఇక లేదని విజయారెడ్డి ఇద్దరు పిల్లలకు ఇంకా తెలియదు!! తమను లాలించి.. ఆడి పాడించిన అందమైన అమ్మ మోమును ప్రస్తుత పరిస్థితుల్లో చూసి తట్టుకోలేరని ఆమె భౌతికకాయాన్ని వారికి చూపించలేదు. అదే అపార్ట్మెంట్లోని పైఅంతస్తులో పిల్లలను ఉంచారు. ‘నాన్నా.. అమ్మ ఇంకా ఎందుకు రాలేదు?’ అనే పిల్లల ప్రశ్నకు సుభాష్రెడ్డి నోట మాట రావడం లేదు. పిల్లలకు సమాధానం చెప్పలేక.. నిర్జీవంగా మా రిన భార్యను చూసి తట్టుకోలేక ఆయన మౌనంగా రోదిస్తున్నారు.
Courtesy Andhrajyothi…