ఒకే కుటుంబంలో 25 మందికి కరోనా

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • ఇంట్లో ఉండడమే కారణం
  • 29కి చేరిన మృతుల సంఖ్య

 న్యూఢిల్లీ/ముంబై : మహరాష్ట్రలోని సాంగ్లీలో ఓ పెద్ద కుటుంబానికి చెందిన 25 మందికి కరోనా సోకింది. వారంతా ఇరుకు ఇంట్లో నివసిస్తుండడంతో వైరస్‌ వేగంగా వ్యాపించింది. సౌదీ అరేబియా నుంచి తిరిగొచ్చిన ఆ కుటుంబంలోని నలుగురు ముందుగా మహమ్మారి బారినపడినట్లు ఈ నెల 23న నిర్ధారణ అయింది. వారంలోపే మరో 21 మంది కుటుంబ సభ్యులకు కూడా వైరస్‌ సోకింది. వారిలో రెండేళ్ల బాలుడు కూడా ఉన్నాడు. ఇరుకు ఇంట్లో అంతా కలిసుండడం వల్ల వారం వ్యవధిలోనే పాతిక మందికి కరోనా సోకిందని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. సోమవారం 1,071కు పెరిగాయి. 24 గంటల్లో 106 కొత్త కేసులు, నాలుగు మరణాలు నమోదయ్యాయి.

దీంతో దేశంలో మృతుల సంఖ్య 29కి చేరింది. ఒక్క మహారాష్ట్రలోనే 10 మరణాలు నమోదయ్యాయి. ఇది మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువ. పుణెలో కరోనా సోకిన 52 ఏళ్ల వ్యక్తి సోమవారం మృతిచెందినట్లు అధికారులు తెలిపారు.  మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో 3 రోజుల క్రితం మరణించిన 38 ఏళ్ల వ్యక్తి నమూనాల పరీక్షా ఫలితాలు సోమవారం వచ్చాయి. అతనికి కరోనా ఉన్నట్లు తేలింది. కేరళలో కొత్తగా 32 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 213కు చేరింది. దేశంలో ఇదే అత్యధికం. 193 కేసులతో మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది. ఒక్క రోజులో తమిళనాడులో 17, ఉత్తరప్రదేశ్‌లో 16 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రాల్లో మొత్తం కేసులు వరుసగా 67, 88కి చేరాయి. కర్ణాటకలో 80, ఉత్తరప్రదేశ్‌ 88, గుజరాత్‌ 69, రాజస్థాన్‌ 60, ఢిల్లీ 53, పంజాబ్‌ 38, హరియా ణా, మధ్యప్రదేశ్‌ 33 చొప్పున, జమ్మూ కశ్మీర్‌ 45, పశ్చిమ బెంగాల్‌ 22, లద్దాఖ్‌ 13, బిహార్‌ 11, అండమాన్‌ నికోబార్‌ 10, చండీగఢ్‌ 8, చత్తీ్‌సగఢ్‌, ఉత్తరాఖండ్‌ 7 చొప్పున, గోవా 5, హిమాచల్‌ ప్రదేశ్‌, ఒడిసాలో మూడు చొప్పున, పుదుచ్చేరి, మి జోరాం, మణిపూర్‌ ఒక్కో కేసు నమోదయ్యాయి. ఎయిరిండి యా ఎయిర్‌పోర్ట్స్‌ సర్వీసెస్‌ (ఏఐఏఎ్‌సఎల్‌) మహిళా ఉద్యోగికి కరోనా సోకింది. ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. ఆమె సహోద్యోగులు 14 మందిని హోమ్‌ క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించినట్లు సంస్థ చీఫ్‌ ఏకే శర్మ తెలిపారు.

అఫ్ఘాన్‌ నుంచి 31 మంది భారత్‌కు
అఫ్ఘానిస్థాన్‌ నుంచి నలుగురు భారత దౌత్య అధికారులు, 26 మంది ఐటీబీపీ సిబ్బంది, ఓ పౌరుడిని ప్రత్యేక విమానంలో తీసుకొచ్చారు. 31 మందితో కాబూల్‌ నుంచి బయలుదేరిన ఈ విమానం సోమవారం మధ్యాహ్నం 2.40 గంటలకు ఢిల్లీలోని ఐజీఐ విమానాశ్రయంలో దిగింది. వారందర్నీ క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు. వారి రక్త నమూనాలను పరీక్షించనున్నారు.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates