-860 కంపెనీల అభిప్రాయాలు సేకరణ : ఆర్బీఐ సర్వే
న్యూఢిల్లీ : కరోనా వైరస్ వల్ల అన్ని రంగాల్లో వ్యాపార విశ్వాసం సన్నగిల్లిందని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. మార్చి 18-20 తేదిల్లో జరిపిన ఈ సర్వేల్లో 860 కంపెనీల అభిప్రాయాలను సేకరించింది. కరోనా ప్రభావం నేపథ్యంలో గడిచిన మార్చి త్రైమాసికంలో తయారీ రంగంపై 89వ రౌండ్ ఇండిస్టీయల్ అవుట్ సర్వే చేపట్టింది. ప్రస్తుతం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో డిమాండ్లో కొంత మెరుగుదల ఉండొచ్చని ఈ సర్వేలో ఆశాభావం వ్యక్తం చేశారు. క్రితం మార్చి త్రైమాసికంతో పోల్చితే జూన్ త్రైమాసికంలో ఉత్పత్తి, ఎగుమతులు, దిగుమతులు, ఉపాధి, స్థూల విత్త పరిస్థితి, స్థూల ఆర్ధిక పరిస్థితిలో వరుసగా 17.2 శాతం నుంచి 23.7 శాతానికి, 8.6 శాతం నుంచి 11 శాతానికి, 5.4 శాతం నుంచి 6.6 శాతానికి, 1.8 శాతం నుంచి 5.2 శాతానికి, 19.5 శాతం నుంచి 24.3 శాతానికి, 22.6 శాతం నుంచి 28.2 శాతానికి పెరగొచ్చని అంచనాలు వచ్చాయి.
Courtesy: NT