ఆడపిల్ల పుట్టిందని మగ శిశువు కిడ్నాప్‌

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

‘గాంధీ’లో కలకలం.. సీసీ పుటేజీతో దొరికిన మహిళ

బౌద్ధనగర్‌/హైదరాబాద్‌ : గాంధీ ఆస్పత్రిలో శిశువు కిడ్నా్‌పకు ఓ మహిళ యత్నించింది. గాంధీ ఆస్పత్రి సిబ్బంది, పోలీసులు సీసీ పుటేజీ ద్వారా ఆమెను గుర్తించి పట్టుకున్నారు.  సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ బాలగంగిరెడ్డి తెలిపిన వివరాలివీ. మాసబ్‌ట్యాంక్‌ చాచా నెహ్రునగర్‌కు చెందిన సఫీయాభాను కాన్పు కోసం గాంధీ ఆస్పత్రిలో చేరింది. ఈ నెల 21న మగశిశువుకు జన్మనిచ్చింది. స్వస్థత కోసం శిశువును పీడియాట్రిక్‌ విభాగం ఎన్‌ఐసీయూ వార్డులోని ఇంక్యుబేటర్‌లో ప్రతి రోజూ కొంత సమయం పెడుతున్నారు. పశ్చిమబెంగాల్‌ న్యూజల్పాయిగురి జిల్లా కెలావాడి గ్రామానికి చెందిన పూల్‌మణి మహాలీ కొద్ది రోజుల క్రితం గాంధీలోనే ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆ శిశువును కూడా ఎన్‌ఐసీయులోని ఇంక్యుబేటర్‌కు తరలించారు. పూల్‌మణికి ఆడపిల్ల పుట్టిందని తెలుసుకున్న సోదరి సరితానాయక్‌ మనస్తాపానికి గురైంది. సోదరిని పరామర్శించేందుకు ఆస్పత్రికి వచ్చినప్పుడు పీఐసీయూ ఇంక్యుబేటర్‌లో ఉన్న మగశిశువును మంగళవారం కిడ్నాప్‌ చేసింది. శిశువు మాయమైన విషయాన్ని సఫీయాభాను సోదరి సాదియాభా సిబ్బందికి తెలిపింది. అవుట్‌పోస్ట్‌ పోలీసులు సీసీ పుటేజీని పరిశీలించగా.. మగశిశువును సరితా నాయక్‌ తీసుకువెళ్తుండటం బయటపడింది. పోలీసులు ఆమెపై కిడ్నాప్‌ కేసు నమోదు చేశారు.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates