ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఉదయం 11 గంటల సమయానికి ఆమ్ ఆద్మీ పార్టీ 54 స్థానాల్లోనూ, బిజెపి 15 స్థానాల్లోనూ ఆధిక్యంలో ఉన్నాయి. ఇంకా పలు రౌండ్ల ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉన్నది. కాంగ్రెస్కు ఒక్క స్థానంలోనూ ఆధిక్యం లేదు. ఒరవడి కొనసాగుతుందని అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.