– సీఎం సహాయనిధికి రూ.10వేలు ఇచ్చిన అలివేలు
– కేటీఆర్కు చెక్కు అందజేత
ఆమె చిరుద్యోగి.. వచ్చే జీతమూ తక్కువే.. అయితేనేమీ కరోనా లాక్డౌన్ నేపథ్యంలో తన పెద్దమనసు చాటుకున్నారు. జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికురాలు అలివేలు తనవంతు సాయం చేసింది. తన నెల జీతం రూ.12వేల నుంచి సీఎం సహాయనిధికి రూ.10వేలు విరాళంగా ఇచ్చింది. పురపాలకశాఖ మంత్రి కేటీఆర్కు మంగళవారం చెక్కు అందజేసింది. అలివేలు ఆలోచనకు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. అలివేలు కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ‘మీ కుటుంబానికి ఏదైనా నా అవసరం ఉంటే చెప్పండి’ అని చెప్పారు. అయితే, తాను ఎలాంటి ప్రయోజనమూ ఆశించి ఈ విరాళం ఇవ్వడం లేదని ఆమె అన్నారు. జియాగుడకు చెందిన అలివేలు ఐదేండ్లుగా జీహెచ్ఎంసీలో పారిశుధ్య విభాగంలో కార్మికురాలిగా పనిచేస్తున్నది. భర్త శ్రీశైలం, పిల్లలు శివప్రసాద్, వందన తన ఆలోచనకు అండగా నిలిచారని తెలిపింది. ఒకవైపు కరోనా నివారణ పని చేస్తూనే.. మరోవైపు తనవంతుగా సహాయం చేయడం సంతోషకరమని, ఇతరులకు ఆదర్శంగా నిలిచారని మంత్రి కేటీఆర్ అన్నారు.
Courtesy: NT