– ప్రభుత్వ వైద్యంతో పోలిస్తే.. ప్రయివేటులో వ్యయం 7 రెట్లు ఎక్కువ
– పట్టణాల్లో సగటు కుటుంబ వ్యయం రూ.38,822 : ఎన్ఎస్ఎస్ఓ నివేదిక
న్యూఢిల్లీ : సగటు పౌరుడు తనకోసం, తన కుటుంబ సభ్యుల కోసం… ప్రభుత్వ వైద్యం, ప్రయివేట్ వైద్యంపై ఎంత ఖర్చు పెడుతున్నాడని అధ్యయనం చేయగా ఆశ్చర్యకరమైన సంగతులు బయటకొచ్చాయి. ఈ దేశ ప్రజల్ని ప్రయివే టు వైద్యరంగం ఏ స్థాయిలో దోచుకుంటుందో అధ్యయనంలోని గణాంకాలు తెలి యజేస్తున్నాయి. ఒక సగటు కుటుం బానికి ప్రభుత్వ హాస్పిటల్స్లో అయ్యే ఖర్చు తో పోల్చితే ప్రయివేట్ ఆస్పత్రిలో అయ్యే ఖర్చు 7 రెట్లు ఎక్కువగా ఉందని ‘జాతీ య గణాంక కార్యాలయం'(ఎన్ఎస్ఎస్ఓ) వెల్లడించింది. ఎన్ఎస్ఎస్ఓ తాజా అధ్యయనం ప్రకారం, సగటు కుటుంబం ప్రభుత్వ వైద్యం కోసం రూ.4,452 ఖర్చు చేయ గా, ప్రయివేట్ ఆస్పత్రిలో రూ.31,845 ఖర్చు చేసింది. ఇన్పేషంట్లకు సంబంధించి ప్రయివేట్ ఆస్పత్రుల్లోనే ఎక్కువ మంది వైద్యం చేయించుకుంటున్నారు. జులై 2017-జూన్ 2018 మధ్య జరిగిన సర్వే వివ రాల్ని ఎన్ఎస్ఎస్ఓ తాజాగా విడుదలచేసింది. ఇందులో పేర్కొన్న అంశాలు ఇలా ఉన్నాయి. గ్రామాల్లో ఒక సగటు కుటుంబం ప్రభుత్వ వైద్యంపై రూ.4290 వ్య యం చేయగా, ప్రయివేట్ వైద్యంపై 27,347 ఖర్చు చేసింది. పట్టణాల్లో ఇది మరింత ఎక్కువగా (రూ.38,822) ఉందని తేలింది. జులై 2017-జూన్ 2018 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా 1.13 లక్షల కుటుంబాల నుంచి సేకరించిన సమా చారంతో ఈ నివేదికను రూపొందించినట్టు ఎన్ఎస్ఎస్ఓ తెలిపింది. ఇలాంటి సర్వేలు ఇంతకు మందు 1995-96, 2004, 2014లలో నిర్వహించినట్టు నివేది క పేర్కొన్నది.ఇన్పేషంట్ వైద్యచికిత్సలు ప్రభుత్వ హాస్పిటల్స్లో42శాతం, ప్రయి వేట్లో 55శాతం నమోదు అయ్యాయి. చారిటీ, ట్రస్టులు, ఎన్జీఓల ఆధ్వ ర్యంలో నడిచే హాస్పిటల్స్లలో 2.7శాతంగా ఉంది. ప్రభుత్వ హాస్పిటల్స్లో శిశుజనానికి సగటు కుటుంబం రూ.2404 ఖర్చు చేయాల్సి వచ్చింది. పట్టణ ప్రాంతాల్లో ఇది మరింత ఎక్కువగా…రూ.3106 ఉందని తేలింది. అదే ప్రయివేట్ ఆస్పత్రుల్లో శిశుజనానికి పట్టణాల్లో రూ.29,105 వ్యయం చేయాల్సి వచ్చింది.
– ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిగిన మొత్తం శిశుజననాల్లో 28 శాతం శస్త్రచికిత్స (సిజేరియన్) ద్వారా జరిగినవి ఉన్నాయి. ఇందులో 92శాతం శస్త్ర చికిత్సలు ఉచితంగా జరిగాయని నివేదిక తెలిపింది.
– ప్రయివేట్ హాస్పిటల్స్లో జరిగిన మొత్తం శిశు జననాల్లో 55శాతం శస్త్రచికిత్స ద్వారా జరిగాయి. ఇందులో సర్జరీ ఉచితంగా చేసినవి కేవలం 1శాతం మాత్రమే.
Courtesy navatelangana