మండల్ కమిషన్ అమలు అయినరోజు ఆగస్ట్ 7, 1990 సందర్భంగా …
ప్రభువెక్కిన పల్లకేనోయ్ … అదిమోసే భోయిలు ముఖ్యం కాదంటున్నసామాజిక నేపధ్యంలో, బోయిలుకూడ ప్రజాస్వామ్య పల్లకి ఎక్కాలనే, మానవీకోణంతో, సామాజిక న్యాయం, సహజన్యాయం, చట్టబద్దన్యాయం మేజారిటీ ప్రజలకు దక్కాతలనే మహా ఆశయంతో, ఆలోచనలనుండి వచ్చిందే మండల్ కమిషన్. స్వాతంత్ర అనంతరం దశాబ్ధాలుగా, అమానవీయంగా, సమాజంలో సగం కంటేపైగా ఉన్న బీసీలకు, సహజన్యాయం సామాజక న్యాయం ఎండమావిగా ఉన్ననేపధ్యంలో, వారి అభివృద్ధికోసం ఏర్పాటు చేసందే మండల్కమిషన్, అప్పటి జనతాదళ్ నాయకత్వంలోని ప్రధానమంత్రి వీపీ సింగ్ మండల్ కమిషన్ అమలు చేస్తామని ప్రకటించటంతో, రిజర్వేషన్ అనుకూలురు, వ్యతిరేకులుగా దేశం రెండుగా చీలిపోయింది.
మంచివాడిబుద్ది మాంసంకాడ తెలిసినట్లు, ఆర్.ఎస్.యు. నుండి ఆర్.ఎస్.ఎస్. దాక తమ పాలక కుల ఆధిపత్య స్వభావాన్ని చాటుకున్నారు. అధికారం. అవకాశాలు మెజారిటీలైన OBCలకు కాకుండా అన్నీ మాకే కావలని ఉద్యమాలు చేశారు. డిల్లీలో రాజీవ్గోస్వామి అనే విద్యార్ధి కాల్చుకుని చనిపోయిన సంఘటలో, అద్వానీ వాజ్పేయ్ లాంటి బీజేపీ అగ్రనాయుకులు కూడ రిజర్వేషన్ వ్యతిరేఖ ఉద్యమాలకు నాయకత్వం వహించారు. తాడిత పీడిత ప్రజల పక్షం అనే జ్యోతిబాస్, సోమనాధ్చటర్జీ, ఇంద్రజిత్ గుప్తాలాంటి నాయరులుకూడ రిజర్వేషన్ అనుకూల ఉద్యమం మీద కపటనాటకం ఆడారు. మా, రాష్టంలో కులాలని గుర్తించం అని జ్యోతిబాస్ ద్వంద ప్రమాణాలు పాటించారు. వారితీరు ఎలా ఉందంటే? వ్యాపార ప్రకటలలోకండిషన్స్ అప్టైలా ఉంది. రాజీవ్గాంధీకూడ పార్లమెంట్లో బిల్లుపెట్టిన రోజు మండల్కమిషన్కు వ్యతిరేకంగా రెండుగంటలు ప్రసంగించారు. దేశంలోని, మెజారిటీ పార్టీల నాయకుల అధినాకులందరు రిజర్వేన్ష్లపై విషం కక్కటంతో, పెద్దఎత్తున అల్లర్లు జరిగాయి కొందరు విద్యార్ధలు ఆత్మహత్యలు చేసుకుని మరణించారు. మండల్ కమిషన్కు అనుకూలంగా, జాతీయ స్థాయిలో, శరద్ యాదవ్, ములాయమ్ సింగ్ యాదవ్, లాలుప్రసాద్ యాదవ్లు, ఓబీసీలకు నాయకత్వం వహించి అగ్రభాగాన నిలిచారు. ఈ త్రితయం మండలేట్స్గా పేరుగాంచారు. వీరు నేటికి బలహీనవర్గాల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్నారు. మండల్కమిషన్ నాటినుండి బలహీనవర్గాలలో కొంతమేరకు ఐక్యతా బీజం కూడ పడిందని చెప్పవచ్చు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శంకర్గౌడ్ నాయకత్వంలో సమసమసంగ్రామపరిషత్ ఏర్పాటు రిజర్వేషన్ అనుకూల ఉద్యమానికి బలమైన నాయకత్వం అందించారు.
ఆగస్టు 7, 1990లో కేంద్రప్రభుత్వరంగ సంస్థలలో అమలు ప్రాంభించటంతో, మండల్ కమిషన్ అమలైంది. దీన్ని ”మండల్ డేగా” కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని, దేశ వ్యాప్తంగా, బలహీన వర్గాల ప్రజలు, మేధావులు కోరుకంటున్నారు. మండల్ కమిషన్ 40 డిమాండ్లు పూర్తి అమలు కోసం బహుజన మేధావి రిటైర్డ్ ప్రొఫిసర్ ఎస్ సింహద్రి, తెలంగాణ బీసీ సంఘం నాయకుడు యం నరేందర్ గౌడ్ కృషి చేస్తున్నారు. మండల్ కమిషన్ ఓబీసీల అభివృధ్దికోసం విద్యా, ఉద్యోగ, ఉపాది, రాజకీయ అవకాశాలు కల్పించటం గురించి సమగ్రంగా, పలబై డిమాండ్లలతో 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నివేదిక యిచ్చింది. కాని కేవలం విద్యా, ఉపాది అవకాశాలలో మాత్రమే కేంద్రంలో అధికారంలో ఉన్నప్రభుత్వాలు అమలు చేయకటం వల్ల దేశవ్యాప్తంగా ఓబీసీలు అసంతృప్తిగా ఉన్నారు. చట్టసభలలో వీరికి రిజర్వేషన్లు లేక పోవటం వల్ల పాలక కులాల దయాదాక్షణ్యాలమీద ఆదారపడవలసి వస్తుంది, పార్లమెంట్లో 275కు పైగా ఉండాల్సిన ఓబీసీ యంపీలు పదుల సంఖ్యకే పరిమితం కావాల్సి వస్తుంది.
పాలకులు ఈ వర్గాలను ఓటు బ్యాంకుగానే, చుస్తున్నరే తప్ప వాస్తవంగా చూడటంలేదు. కారణం ఓబీసీల సామాజిక, ఆర్ధిక వెనకబాటుతోపాటు తనంతో పాటు, దాశాబ్ధాలుగా పదుల సంఖ్యలో ఉన్నపాలక కులాలకే, అధికారం హస్తగతం కావటం, ఈ కులాలచేతిలోనే సంపద కేంద్రికృతం కావటం, ఎన్నికల కమిషన్ చట్టబద్దంగా పనిచేయక పోవటం, ఓటుకు ఖరీదు పెంచటం కొనుగోలు శక్తికూడ వీరికే ఉండటం కారణాలు… నిర్మాణం లేని బీసీ ఉద్యమాలు ప్రజల్లో కాకుండా, పత్రికల్లోనే ఉద్యమాలు చేసి, ఆ పబ్లీసిటీని మార్కెటంగ్ చేసుకుని, సంపన్నులుగా మారి సామన్యులుగా నటించే కొంతమంది బీసీ నాయకులుకూడ కారణమే.
స్వాతంత్ర అనంతరం బీసీల అభివృద్ధి, సంక్షేమం కోసం కేంద్రప్రభత్వస్థాయిలో, 1953లో కాకాకలేలక్కర్ 7 (1952 .. 1955) కమిషన్ మోదటిది 1955 ఈ కమిషన్ నివేదిక ఇచ్చంది. జాతీయ మండల్ కమిషన్ రెండవది. 52 శాతం ఉన్నబీసీలలో విద్యాపరంగా, కులపరంగా ఉన్నవివక్షను నిర్ములించటానికి, మండల్కమిషన్ జనవరి 1, 1978లోఏర్పటైంది. 1980లో నివేదిక ఇవ్వటం జరిగింది. జనతా పార్టీ ఏలుబడిలో, ప్రధాన మంత్రి ముర్జాజీదేశాయినాయకత్వంలో మండల్ కమిషన్ ఏర్పాటైంది. దీనికి బిందేశ్వరీప్రసాద్ మండల్ ఛైర్మన్గా వ్యవహరించారు. బీపీ మండల్ బీహర్లోని, బనారస్లో ఆగస్ట్ 25, 1918 జన్మించారు ఎప్రిల్ 13 1982 లో మరణించారు. బీహర్లోని సహర్సాలోని భూస్వామ్య యాదవ కులంలో జన్మించారు. 1930లో పాట్నలో ఇంటర్ చదివారు. మండల్ తన 23వ ఏట జిల్లా కౌన్పిల్కు ఎన్నికయ్యాడు. నీజాయితీ పరుడిగా పేరుంది. 1945 నుండి 1951 వరకు మాదేపూరా డివిజన్లో జుడిషియల్ మెజిస్ట్రేట్గా జీతం తీసుకోకుండా పనిచేశారు. 1952 మోదటిసారి బీహర్ అసంభ్లీకి ఎన్నికయ్యారు. 1965లో తన నియోజకవర్గమైన పామాలో పోలీసులు మైనారిటీలు దళితులమీద దాడులను నిరసిస్తూ, మాట్లాడాలనుకున్నప్పుడు, ముఖ్యమంత్రి కట్టడిచేస్తే, ఆత్మగౌరవం చంపుకోలేక రాజీనామా చేసి సంయుక్తసోషలిస్టు ( ఎస్.ఎస్.పీ) పార్టీలో చేరారు. 1962 వరకు 7 సీట్లు ఉన్న ఆపార్టీకి 1969 ఎన్నికలలో 69 సీట్లు సాధించి పెట్టాడు. 1968 ఫిబ్రవరి 1 కాంగ్రేస్ మద్దతుతో బీహార్ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రి అయ్యారు. కాంగ్రేస్ నాయకుల అవినీతిపై మండల్, అయ్యర్ కమిషన్ వేయగా, రిపోర్ట్ బయట పెట్టవద్దని ఇందిరాగాంధీ కోరారు. ఆమె మాట వినకపోవటంతో మద్దత్ ఉపసంహరించటంతో, నెల రోజులకే రాజీనామా చేయాల్సివచ్చంది. మెజిస్ట్రేట్గా జీతం తీసుకోకుండా పనిచేశారు. 1967 నుంచి 1972, 1977 నుంచి 1980 వరకు మాదేపూరానుంచి పార్టమెంట్ సభ్యులుగా పనిచేశారు.
ఈ కమిషన్కు సామాజిక. విద్యా, సాంస్కృతిక, ఆర్ధిక తదితర 11 అంశాల ప్రాతిపదికగా రిపోర్టు ఉండాలని కమిషన్ నిర్ధేశించింది. ఆ తరువాత మురార్జీదేశాయ్ మనణించటం, కాంగ్రేస్ నాయకత్వంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రికాడంతో, 10 ఏళ్ళు మండల్ కమిషన్ మరుగునపడింది. రాజా కుటుంబం నుంచి వచ్చిన వీపీ సంగ్ ప్రధాన మంత్రిగా ఉన్నసమయంలో దీన్నీఅమలు చేయటంతో, విశ్వనాధప్రతాప్ సింగ్, ఓబీసీల ఆరాద్యనాయకుడ్యాయ్యారు.
మండల్ స్పూర్తితో 55 శాతం ఉన్న ఓబీసీలు వారెంతో వారికంత వాటా దక్కాల్సన అవసరాన్ని పాలకులు గుర్తించాల్సన అవసరం ఉంది. ప్రేమతో కాకపోయినా, పరిణామాక్రమంగా వారిలో వస్తున్నచైతన్యం, మార్పులు పరిణలోకి తీసుకోవాలి. పాలకులు ఓబీసీల పట్ల ఆపదమోక్కులు, అవసరార్ధం బ్రామ్మణ్యం అనేతీరుతో వ్యవరించటం వల్ల అసంతృప్తితో ఓబీసీలు అభ్యంతరం వ్యక్తతం చేస్తున్నారు. సత్యంకోసం, న్యాయంకోసం, ధర్మంకోసం అని పలికే బీజేపీ నాయకులు ఈ దేశంలో 55 శాతం పైగా ఓబీసీలు ఉన్నది సత్యం, వారికి సకల రంగాలలో దామాషా దక్కాల్సింది ధర్మం కాదా, ఓబీసీలకు కేంద్రంలో మంత్రిత్వ శాఖ లేకపోవటం అన్యాయం కాదా, రెవెన్యూరికార్డులప్రకారం చెట్లకు, పుట్టలకు, గుట్టలకు లక్కలున్నయి, సమాజంలో 55 శాతం ఉన్న ఓబీసీలకు ఎస్స్సీ, ఎస్టీలలాగ ఓబీసీ జనాభా లెక్కలు లేకపోవటం, పాలకుల లెక్కలేని తనమా, లెక్క తెలవపోవటమే పాలకుల ఉద్ద్యేశమా, నరేంద్రమోడి ఓబీసీ ప్రధాని చెప్పుకోవటం వల్ల ఉపయోగం లేదు, ప్రభుత్వవిధానాల ద్వారా, రాజకీయ, సంక్షేమ, అభివృద్ధి కార్యకంరమాలు చిత్తశుద్ధితో అమలు చేస్తేనే, మండల్ కమిష్న్ ఉద్యమంలో బీజేపీ ఓబీసీలకు వ్యతిరేకమనే ముద్రపోతంది. మండల్ కమిషన్ అమలై 30 ఏళ్ళు అవుతున్నా, బీపీ మండల్, వీపీ సింగ్ ఓబీసీల స్మృతి పధంలో మెదలాడుతునే ఉన్నారు.