మారుతీరావుకి బెయిల్ రావటాన్ని నిరసిస్తూ మిర్యాలగూడలో ప్రెస్ మీట్

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

 

ప్రణయ్ ని చంపించిన క్రూరుడు మారుతీరావుకి ఇచ్చిన బెయిల్ ని వెంటనే రద్దు చేయాలి. సోషల్ మీడియాలో అమృతను అవమానించి బెదిరిస్తున్నసైబర్ నేరగాళ్లపై కేసులు నమోదు చేసి శిక్షించాలి. ఈ బెదిరింపుల్ని ప్రోత్సహిస్తున్న మారుతీరావు కండిషన్ బెయిల్ వెంటనే రద్దు చేయాలి. మారుతీరావు విడుదల కావడం వల్ల  సాక్షులను ప్రభావితం చేయటమేకాక, అతని వల్ల బాధితులయిన అమృత, బాలాస్వామి అమృత- ప్రణయ్ ల పసిబిడ్డ నిహాన్ ప్రణయ్ లకు ప్రమాదం పొంచిఉన్నందువల్ల SC,ST చట్టం ప్రకారం అతడిని మిర్యాలగూడ పట్టణం , నల్గొండ ఉమ్మడి జిల్లా నుండి వెంటనే బహిష్కరించాలి. మిర్యాలగూడ పట్టణంలోనే స్పెషల్ కోర్టు ఏర్పాటు చేసి సత్వరమే న్యాయవిచారణ జరపాలి. న్యాయవిచారణలో బాధితులకు అండగా , నిందితులకు కఠిన శిక్షలు పడేలా స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను నియమించాలి, నిందితులు నేరంనుండి తప్పించుకోకుండా పోలీసు అధికారులు వెంటనే చార్జీషీట్ వేయాలి అని డిమాండ్ చేస్తూ 1-05-2019 మిర్యాలగూడలో ప్రెస్ మీట్ జరిగింది.

Usaa, Sadanadam – UCCRI(ML) and Bandari Laxmaiah with Pranay Son Nihan Pranay

ప్రణయ్- అమృత న్యాయపోరాట సంఘీభావ కమిటి: (1) ఉ. సాంబశివరావు – ఉ.సా., బహుజన ప్రతిఘటన  వేదిక రాష్ట్ర కోఆర్డినేటర్(2) బండారి లక్ష్మయ్య, KNPS రాష్ట్ర అధ్యక్షులు(౩)  గడ్డం సదానందం, రాష్ట్ర కన్వీనర్ కులనిర్మూలన ఉద్యమం (CAM)(4)  పెరుమాళ్ల బాలస్వామి, ప్రణయ్ తండ్రి(5) అమృత – ప్రణయ్ భార్య(6) డా.. రాజు , స్థానిక వైద్యులు, మిర్యాలగూడ (7) శ్రీరాములు, సామాజిక కార్యకర్త మిర్యాలగూడ

 

 

RELATED ARTICLES

Latest Updates