ఆర్టీసీ తేలేనా?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

ఆర్టీసీ సమ్మె 33వ రోజుకు చేరింది. హైకోర్టులో గురువారం కీలక విచారణ జరగనుంది. సమ్మెపై తానడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సరిగా స్పందించడం లేదని భావిస్తున్న చీఫ్‌ జస్టిస్‌ చౌహాన్‌ సారథ్యంలోని ధర్మాసనం… ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్టీసీ ఎండీ సునీల్‌ శర్మ, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌లను కోర్టుకు రావాల్సిందిగా ఆదేశించింది. నలుగురు ఉన్నతాధికారులూ ఉన్నత న్యాయస్థానం ముందు అఫిడవిట్లతో సహా హాజరుకానున్నారు. ..ఇక ఏం జరగనుంది?

  • నేడే హైకోర్టులో కీలక ఘట్టం
  • సీఎస్‌, ఉన్నతాధికారుల హాజరు
  • ుఽ బకాయి పడింది ప్రభుత్వం కాదు
  • ఆర్టీసీయే మాకు బాకీ!
  • మోటారు వాహన పన్ను కింద ఆ సంస్థే రూ.453 కోట్లు చెల్లించాలి
  • ఇస్తానన్న సొమ్ములో పైసా బకాయి లేదు
  • అయిదేళ్లలో అదనంగా 897 కోట్లిచ్చాం
  • జీహెచ్‌ఎంసీ ఇవ్వాల్సిందీ ఇచ్చేసినట్లే లెక్క
  • మేం అదనంగా ఇచ్చిన సొమ్ముతో చెల్లు
  • హైకోర్టులో ఉన్నతాధికారుల అఫిడవిట్లు

హైదరాబాదు : ఆర్టీసీకి తానేమీ బకాయి లేనని ప్రభుత్వం తేల్చేసింది. ఇంకా చెప్పాలంటే ఆర్టీసీయే ప్రభుత్వానికి రూ.453 కోట్లు బాకీ ఉందని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ఉన్నతాధికారులు ముగ్గురు హైకోర్టులో అఫిడవిట్లు దాఖలు చేశారు. మూడు అఫిడవిట్లు, రెండు తాఖీదులు ఆర్టీసీ సంక్షోభ పరిష్కారం ఆశలను నీరుగార్చేశాయి. ఆర్టీసీకి ఇవ్వాల్సిన దానికన్నా ప్రభుత్వం రూ.897 కోట్లు అదనంగా ఇచ్చిందని ఆర్టీసీ ఎండీ సునీల్‌ శర్మ చెబితే, ఇల్లు గడవకున్నా ఆర్టీసీకి రూ.138 కోట్లు చెల్లించామని సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులకు, బస్సులు నడపడానికి వచ్చిన తాత్కాలిక సిబ్బందికి మధ్య మెల్లిగా ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. మహబూబ్‌నగర్‌లో తాత్కాలిక కండక్టర్‌ కమలను ఆర్టీసీ కార్మికులు జుట్టు పట్టి గుంజుతున్న దృశ్యమిది. జీహెచ్‌ఎంసీ నివేదించింది. ఆర్టీసీయే మోటారు వాహనాల పన్ను కింద రూ.453 కోట్లు బకాయి పడిందని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు వెల్లడించారు. ఈ మొత్తాన్ని తక్షణమే చెల్లించాలని ఆర్టీసీకి రవాణా శాఖ తాఖీదు పంపింది. దీనికి తోడు రిటైర్డ్‌ ఉద్యోగుల పెన్షన్‌ నిధి 411 కోట్లు ఆర్టీసీ వాడుకోవడంపై హైకోర్టు భగ్గుమంది. తక్షణమే రూ.200 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. ఇవన్నీ కుంగిపోతున్న సంస్థకు ప్రభుత్వం ఆర్థిక మద్దతు ఇచ్చే అవకాశాలు మృగ్యమైపోతున్నాయని సంకేతాలు ఇస్తున్నాయి. ఆర్టీసీకి ప్రభుత్వ పరంగా ఎలాంటి బకాయిలు లేవని ఇన్‌చార్జి ఎండీ సునీల్‌ శర్మ, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌లు వేర్వేరుగా బుధవారం అఫిడవిట్లు దాఖలు చేశారు. సమ్మెపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో అధికారులు ఈ అఫిడవిట్లు ఇచ్చారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి సుమారు 3006 కోట్లు చెల్లించాల్సి ఉండగా 3,903 కోట్లు చెల్లించిందన్నారు. గురువారం జరిగే విచారణకు సీఎస్‌తో పాటు అధికారులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్లపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా తమకు చెల్లించాల్సిన రూ. 453 కోట్లను తక్షణమే చెల్లించాలని ఆర్టీసీకి రవాణా శాఖ తాఖీదులు జారీచేసింది.

Courtesy AndhraJyothy..

RELATED ARTICLES

Latest Updates