వెంటిలేటర్‌పై ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

చెన్నై: కరోనా బారిన పడిన ప్రముఖ సినీ గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆయనను ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్న ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు అధికారికంగా బులెటిన్‌ విడుదల చేశాయి. కరోనా లక్షణాలతో ఈ నెల 5న ఆయన చెన్నైలోని ఎంజీఎం హాస్పటల్‌లో చేరిన విషయం తెలిసిందే. నిన్న రాత్రి నుంచి ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు సమాచారం.

ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగా క్షీణించడంతో గురువారం రాత్రి ఐసీయూకి తరలించినట్లుగా ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం నిపుణులైన డాక్టర్లు ఆయనని పర్యవేక్షిస్తున్నారని, లైఫ్ సపోర్ట్‌తో చికిత్స అందిస్తున్నట్లుగా తాజాగా విడుదల చేసిన బులెటిన్‌లో హాస్పటల్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లుగా ఎంజీఎం హాస్పటల్ వర్గాలు ప్రకటించాయి. బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని సినిమా రంగానికి చెందిన ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా కోరుకుంటున్నారు.

RELATED ARTICLES

Latest Updates