– సమాచారం ఇవ్వడం.. ఇవ్వకపోవడం ఐచ్ఛికమే :రాజ్యసభలో కేంద్ర హోం మంత్రి
నేషనల్ పాపులేషన్ రిజిస్టర్(ఎన్పీఆర్)కు ఏ డాక్యుమెంట్ అవసరం లేదని కేంద్ర హౌంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. ఢిల్లీ అల్లర్లపై సభ్యులు లేవనెత్తిన పలు అంశాలపై గురువారం రాజ్యసభలో ఆయన మాట్లాడారు. దేశంలోని ఏ మతస్థులైనా, ఎలాంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదన్నారు.నిర్దిష్టమైన సమాచారం ఇవ్వకూడదని ఎవరైనా భావిస్తే…సర్వేకు వచ్చే అధికారులు ఏ ప్రశ్నలు అడగరని తెలిపారు. సమాచారం ఇవ్వడం, ఇవ్వకపోవడ ఐచ్ఛికమే నన్నారు. ఎన్పీఆర్పై ఎవరూ భయపడాల్సిన అవసరంలేదని వివ రించారు. ఈ అప్డేట్ ప్రక్రియలో ఎవరినీ సందేహాస్పదం(డీ కేటగిరి) కింద గుర్తించరని తెలిపారు. ఎన్పీఆర్ ప్రక్రియలో భాగంగా అడిగే ప్రతి సమాచారం అపన్షల్ మాత్రమే అని అమిత్ షా చెప్పారు. ఢిల్లీ అల్లర్లకి ముందు సుమారు వందల ఫేస్బుక్ అకౌంట్లు సష్టించి… ఫిబ్రవరి 25వ తేదీన డీయాక్టివేట్ చేశారని చెప్పారు. వారంతా చట్టం నుంచి తప్పించు కోలేరన్నారు. అల్లర్లకి సంబంధించి ఇప్పటివరకు ఐదుగురిని అరెస్టు చేసినట్టు వెల్లడించారు.
Courtesy: NT