బాలుడికి బేడీలు, గొలుసులతో బందీ

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

సెల్‌ఫోన్‌ చోరీ కేసులో చితకబాదిన పోలీసులు 

ఈ మైనర్‌ బాలుడి చేతికి బేడీలు వేసి ఏకంగా గొలుసుతో బంధించారు మహబూబ్‌నగర్‌లోని టూ టౌన్‌ పోలీసులు. 8వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల ఈ బాలుడు ఉగ్రవాదో, హంతకుడో కాదు. ఓ మొబైల్‌ దుకాణం నుంచి సెల్‌ఫోన్‌ దొంగిలించాడు. దుకాణ యజమాని ఫిర్యాదుతో బాలుడిని చితకబాదిన పోలీసులు స్టేషన్‌లోనే ఇలా గొలుసుతో బంధించారు. సెల్‌ఫోన్‌ రికవరీ చేసి కౌన్సెలింగ్‌ ఇవ్వాలి. లేదా జువెనైల్‌ కేసు నమోదు చేయాలి. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అంటూనే ఇంత చిన్న నేరానికి ఇంతటి కఠిన శిక్ష వేయడంపై స్థానికులు విమర్శిస్తున్నారు.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates