కిలిమంజారో అధిరోహించిన తెలంగాణ విద్యార్థిని

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

మద్దూర్‌, జనవరి : టాంజానియాలోని కిలిమంజారో పర్వతాన్ని నారాయణపేట జిల్లా మద్దూర్‌ మండలం చెన్వార్‌ గ్రామానికి చెందిన మీదింటి ఎల్లప్ప కుమార్తె లక్ష్మి గురువారం అధిరోహించింది. సముద్రమట్టం నుంచి 18,885 అడుగుల ఎత్తులో ఉన్న స్టెల్లా పాయింట్‌ను చేరుకుంది. ఈ నెల 17న ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళింది. ఆమె ప్రస్తుతం మాహబూబ్‌నగర్‌ జిల్లాలోని సాంఘిక సంక్షేమ డిగ్రీ కళాశాలలో బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఇంటర్‌ చదువుతున్న సమయంలో భువనగిరి కొండలు, లద్దాఖ్‌ పర్వతాలను అధిరోహించింది. ఆమె విజయానికి సహాయ సహకారాలు అందించిన రాష్ట్ర గురుకులాల కార ్యదర్శి డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, కళాశాల ప్రిన్సిపాల్‌కు చెన్వార్‌ గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు. లక్ష్మిని అభినందించారు.

RELATED ARTICLES

Latest Updates