నమ్మిన బంటుకే అధ్యక్ష పీఠం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

 

  •  బీజేపీ చీఫ్‌గా జేపీ నడ్డా ఎన్నిక
హిమాచల్‌ వ్యవహారాలను నేను పర్యవేక్షిస్తూ, సిమ్లాలో ఉన్నపుడు నడ్డా నాకు మంచి స్నేహితుడిగా నిలిచారు. నన్ను తన స్కూటర్‌పై వివిధ ప్రదేశాలకు తీసుకొని వెళ్లేవారు. కలిసి టీ తాగేవాళ్లం. ఎన్నటికీ ఆ స్నేహాన్ని మరిచిపోలేను
ప్రధాని మోదీ
అమిత్‌ షా స్థానంలో బాధ్యతలు..
సంఘ్‌ కార్యకర్తగా మొదలై..
ఏబీవీపీ నేతగా ఎదిగిన నడ్డా
పదేళ్ల క్రితం దేశ రాజకీయాల్లోకి
మోదీ- షాలకు విశ్వాసపాత్రుడు
సంస్థాగత వ్యవహారాల్లో దిట్ట
తొలి సవాల్‌ ఢిల్లీ, బిహార్‌ పోల్స్‌

న్యూఢిల్లీ: బీజేపీ 11వ అధ్యక్షుడిగా జేపీ నడ్డా (59) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఐదున్నరేళ్ల పాటు ఈ పదవిలో ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా స్థానే పూర్తిస్థాయి అధ్యక్షుడిగా లాంఛనంగా నియమితులయ్యారు. నిజానికి ఏడాది కాలంగా నడ్డా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బీజేపీని అగ్రస్థానంలో నిలిపిన అమిత్‌ షాకు పనిభారం ఎక్కువ కావడంతో నడ్డాయే సంస్థాగత వ్యవహారాలన్నీ చూసుకుంటున్నారు. అన్ని రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ముగిసిందనీ, అధ్యక్ష పదవికి నడ్డా అభ్యర్థిత్వం ఒక్కటే వచ్చిందనీ ఎన్నికల ఇన్‌చార్జి రాధామోహన్‌సింగ్‌ ప్రకటించారు. షాతో పాటు మాజీ అధ్యక్షులు రాజ్‌నాథ్‌, గడ్కరీ -నడ్డా పేరు ప్రతిపాదించగా పార్లమెంటరీ బోర్డు ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ నియామకంతో బీజేపీలో గడ్కరీ తరువాత బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి ఐదో వ్యక్తి పార్టీ చీఫ్‌ అయ్యారు.

 మాటల్లో ముక్తసరి… చేతల్లో గడసరి
జగత్‌ ప్రకాశ్‌ నడ్డా 1960 డిసెంబరు 2న హిమాచల్‌లోనే జన్మించారు. అయితే ఆయన తండ్రి ఎన్‌ ఎల్‌ నడ్డా రాంచీ విశ్వవిద్యాలయ ఉప కులపతిగా నియమితులవడంతో కుటుంబం బిలా్‌సపూర్‌కు వెళ్లింది. కొన్నాళ్ల తరువాత నడ్డా పట్నాకు మారడంతో అక్కడే సెయింట్‌ జేవియర్‌ స్కూల్లో చదివారు. ఆర్‌ఎ్‌సఎస్‌ భావజాలం చిన్ననాటి నుంచే ఆయనను ఆకర్షించింది. కాలేజీ రోజుల్లో ఏబీవీపీ నేత అయ్యారు. పట్నా వర్సిటీలో బీఏ చదివారు. ఎమర్జెన్సీ సమయంలో నిరసన ప్రదర్శనలు తీసినందుకు ఆయన 45 రోజుల పాటు నిర్బంధంలో ఉన్నారు.

ఆయన ఎల్‌ఎల్‌బీ చదవడానికి మళ్లీ హిమాచల్‌ ప్రదేశ్‌ వెళ్లిపోయారు. అక్కడ న్యాయశాస్త్రంలో మాస్టర్స్‌ చేశాడు. 1993లో తొలిసారి హిమాచల్‌ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తరువాత వరుసగా 1998, 2007లో కూడా ఎమ్మెల్యే అయ్యారు. శాంతకుమార్‌ మంత్రివర్గంలో కూడా పనిచేశారు. 2010లో ఆయన జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా నితిన్‌ గడ్కరీ ఆయనను నియమించారు.

దాంతో 2012లో మళ్లీ రాష్ట్ర అసెంబ్లీకి పోటీచేయకుండా రాజ్యసభ సభ్యుడై జాతీయ రాజకీయాల్లోనే ఉండిపోయారు. అప్పుడే మోదీ హవా మొదలవుతోన్న కాలం… ఆ సమయంలో ఆయన మోదీ-షాలకు చేరువయ్యారు. ఫలితంగా 2014లో మోదీ అధికారంలోకొచ్చాక ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు.

షా మాటే వేదవాక్కు..!
2019లో ఆయనను స్వ యంగా తన వారసుడిగి ఎం పిక చేసి ఎదిగేదాకా తానూ బాధ్యతలను పంచుకున్నారు షా! నడ్డా నేతృత్వంలో యూపీలో బీజేపీ 80 సీట్లకు గాను 62 స్థానాలు గెలుచుకోగలిగింది. సా మాజిక మంత్రాంగం షా చేస్తే దాన్ని పక్కాగా అమలు చేసినవారు నడ్డా! స్వ యంగా ఎన్నికల ఇన్‌చార్జిగా వ్యవహరించి ఎస్పీ-బీఎస్పీ కూటమిని దీటుగా ఎదుర్కోవడం ఆయనకు ప్లస్‌ పాయింటైంది. మని షి స్వతహాగా మృదుభాషి. ఏ ఆర్భాటం లేకుండా పని చక్కపెట్టగల దిట్ట. సంఘ్‌ పట్ల విశ్వాసం, బీజేపీ సిద్ధాంతాలపై నమ్మ కం ఉన్నవ్యక్తి. మోదీ-షాలకు నమ్మిన బంటు. వారి ఛాయల్లోనే నడవాల్సి ఉన్నప్పటికీ ఇక ప్రత్యక్ష పర్యవేక్షణ ఉంటుంది. మున్ముందు జరిగే ఢిల్లీ, బెంగాల్‌, బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు నడ్డా నేతృత్వానికి తొలి పరీక్ష.

ముఖ్యంగా ఆయన షాకు నమ్మకస్తుడైన నేత అని, మౌనంగా చెప్పిన పని చేసుకుపోతారని పార్టీ వర్గాలు అంటున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా ఆయన ఏనాడూ వివాదాస్పదంగా వ్యవహరించలేదు. 2024 ఎన్నికలకు ముందు అవసరమైతే అమిత్‌ షా మరో సారి పార్టీ అధ్యక్షుడు అయ్యేందుకు వీలుగానే నడ్డా ఎంపిక జరిగిందని ఒక సీనియర్‌ నేత అన్నారు.

టార్గెట్‌ తెలంగాణ!
పూర్తి స్థాయి అధ్యక్షుడిగా తొలి పలుకుల్లో.. బీజేపీ తన బలం విస్తరించుకోవాల్సిన రాష్ట్రాలు ఇంకొన్ని ఉన్నాయని జేపీ నడ్డా అన్నారు. దీనర్థం.. పశ్చిమ బెంగాల్‌, ఢిల్లీతో పాటు తెలంగాణ కూడా ఒకటని విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు నడ్డా కూడా ప్రకటించారు. జాతీయ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన నడ్డాను బీజేపీ రాష్ట్ర కె.లక్ష్మణ్‌ కలిసి రాష్ట్ర శాఖ తరఫున శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్ర పరిస్థితులను నడ్డా అడిగి తెలుసుకున్నారు. కాగా, నడ్డాను కేంద్రహోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. 1991లో తాను, నడ్డా బీజేవైఎంలో పనిచేసినట్లు కిషన్‌రెడ్డి గుర్తుచేసుకున్నారు. నడ్డా రాకతో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడెవరు అవుతారన్నది పార్టీలో చర్చనీయాంశమైంది. ప్రస్తుత అధ్యక్షులు కె.లక్ష్మణ్‌నే కొనసాగిస్తారా? కొత్తనేతకు అవకాశం ఇస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

పార్టీ సంస్థాగత ఎన్నికల షెడ్యూల్‌ ప్రకారం ఇప్పటికే, రాష్ట్ర శాఖ అధ్యక్ష ఎన్నిక జరగాల్సి ఉంది. కానీ, మునిసిపల్‌ ఎన్నికలు రావడంతో వాయిదాపడింది. ఈనెల 25 కల్లా మునిసిపల్‌ ఎన్నికల ప్రక్రియ పూర్తికానుండడం, 26న రిపబ్లిక్‌ డే కావడంతో ఆ తర్వాతే రాష్ట్ర, జిల్లా శాఖల అధ్యక్షుల ఎన్నికలపై సమీక్షించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

(Courtesy Andhrajyothi)

RELATED ARTICLES

Latest Updates