వైజాగ్‌లో సచివాలయం, రాజ్‌భవన్.. అమరావతిలో శాసనసభ సమావేశాలు.. కర్నూలులో హైకోర్టు.. ఏపీ అసెంబ్లీలో బిల్లు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధాని చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సోమవారం నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ సమావేశాలు అమరావతిలో నిర్వహించాలని, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది.

రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. బిల్లును ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.

అమరావతికి సంబంధించి టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ)ను రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. హైపర్ కమిటీ నివేదికకు ఆమోదం తెలిపింది. రాజధానికి భూములిచ్చిన రైతులకు కౌలు చెల్లింపు కాలాన్ని ప్రస్తుతమున్న పదేళ్ల నుంచి 15 ఏళ్లకు కేబినెట్ పెంచింది. ఏటా 10 శాతం చొప్పున పెంచుతూ పదేళ్లపాటు కౌలు చెల్లించాలనే గత నిర్ణయాన్ని సవరించింది.

వికేంద్రీకరణ బిల్లును ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. సీఆర్‌డీఏ రద్దు బిల్లును పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రవేశపెట్టారు. ప్రజాస్వామ్యంలో అతి ముఖ్యమైన మూలస్తంభం చట్టసభలని, శాసన రాజధానిగా అమరావతి ఉంటుందని మంత్రి బుగ్గన సభలో చెప్పారు. విశాఖపట్నం పరిపాలన రాజధానిగా ఉంటుందని, రాజ్‌భవన్, సచివాలయం విశాఖలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. న్యాయ రాజధానిగా కర్నూలు ఉంటుందని, న్యాయపరమైన అన్ని శాఖలు కర్నూలులో ఉంటాయని మంత్రి తెలిపారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన చెప్పారు. తెలంగాణ కన్నా రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనకబడి ఉన్నాయని జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ తేల్చిందన్నారు.

  • ఆంధ్ర, రాయలసీమ: 60 ఏళ్లలో నాలుగు రాజధానులు.. ఇప్పుడు మరో రెండు కలుస్తాయా?
  • అమరావతి ఇష్టం లేకపోతే ధైర్యంగా చెప్పండి.. ఒకరికి కాదు, అందరికీ న్యాయం జరగాలి: పవన్ కల్యాణ్

లోకల్ జోన్లు, జోనల్ డెవలప్‌మెంట్ బోర్డులు ఏర్పాటు చేయాలని వికేంద్రీకరణ బిల్లులో ప్రతిపాదించారు.

“పరిపాలన సంబంధిత వ్యవహారాలు మొత్తం విశాఖ నుంచి జరుగుతాయి. రాజ్ భవన్, సచివాలయం, విభాగాల అధిపతుల(హెచ్‌వోడీ) కార్యాలయాలు విశాఖలో ఏర్పాటు చేయాలి. శాసన కార్యకలాపాలన్నీ అమరావతిలోనే సాగుతాయి. న్యాయ సంబంధిత కార్యకలాపాలు మొత్తం కర్నూల్ నగరం నుంచి జరుగుతాయి. న్యాయవ్యవస్థ ఆమోదం తెలిపిన తర్వాత అమరావతి నుంచి కర్నూలుకు హైకోర్టు తరలింపు మీద నిర్ణయం ఉంటుంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం కర్నూలులో ఏర్పాటు చేయాలి” అని ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది.

4070 ఎకరాలు రాజధాని ప్రకటనకు ముందే కొన్నారు: బుగ్గన
చంద్రబాబు ప్రభుత్వం జూన్‌లో ఏర్పడిందని, రాజధానిని డిసెంబరులో ప్రకటించారని, రాజధాని ప్రకటనకు ముందే ఇప్పుడు రాజధాని ఉన్న ప్రాంతంలో 4070 ఎకరాలను టీడీపీ నాయకులు, వారి బినామీలు కొనుగోలు చేశారని మంత్రి బుగ్గన సభలో ఆరోపించారు. అధికారిక సమాచారం ప్రకారం 4070 ఎకరాలు అని, వాస్తవానికి ఇంతకన్నా పెద్దమొత్తంలో టీడీపీ నాయకులు, బినామీలు భూములు కొన్నారని, ఇదంతా ‘ఇన్‌సైడర్ ట్రేడింగ్’ అని ఆయన ఆరోపించారు.

ఇలా భూములు కొన్నవారిలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, టీడీపీ నాయకులు పయ్యావుల కేశవ్, ధూళిపాళ్ల నరేంద్ర, పల్లె రఘునాథరెడ్డి, మురళీమోహన్, పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్, వారి బంధువులు, పుట్టా మహేష్ యాదవ్, లింగమనేని రమేశ్, జీవీఎస్ ఆంజనేయులు, వేమూరి రవి కుమార్, వేమూరి ప్రసాద్, యార్లగడ్డ రవికిరణ్, బుచ్చయ్య చౌదరి తదితరులు ఉన్నారని మంత్రి బుగ్గన ఆరోపించారు. లంక భూములు, పోరంబోకు భూములు, ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు సహా ఏ భూములనూ వదిలిపెట్టలేదని, ఇది రాజధాని నిర్మాణమా, రియల్ ఎస్టేట్ వ్యాపారమా అని ఆయన వ్యాఖ్యానించారు.

బ్రిటిష్ పాలనలో కోట్ల రూపాయల పన్ను వసూళ్లు లండన్ తరలించి మహా సౌధాలు నిర్మించుకున్నారని, భారతీయులు కనీస అవసరాలకు నోచుకోక పోరాటం చేయాల్సి వచ్చిందని మంత్రి చెప్పారు. ఆధునిక కాలంలో పాలకులు అలాంటి పొరపాట్లు చేయకూడదన్నారు. శ్రీ కృష్ణ దేవరాయలు హయాంలో ఎక్కడా పెద్ద కోటలు నిర్మించలేదని, కానీ అప్పుడు తవ్విన చెరువులు ఇప్పటికీ ఉన్నాయని పేర్కొన్నారు.

సచివాలయం ముట్టడికి ప్రజల యత్నం
మరోవైపు రాజధాని అమరావతి విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు, ప్రజలు సచివాలయం ముట్టడికి ప్రయత్నాలు చేస్తున్నారు. వారిని పోలీసులు అడ్డుకొంటున్నారు. పలు చోట్ల తోపులాటలు జరిగాయి. కొందరు మహిళలు గాయపడ్డారు.
  • ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులు… అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్ ప్రతిపాదన
  • అమరావతి రుణాన్ని తిరస్కరించాలన్న ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వానిదే.. ప్రపంచ బ్యాంకుది కాదు

పెద్దయెత్తున పోలీసుల మోహరింపు

కేబినెట్ భేటీ, అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో, విజయవాడ తదితర ప్రాంతాల్లో ప్రభుత్వం పెద్దయెత్తున పోలీసులను మోహరించింది. రాజధాని పరిధిలోని మందడంలో గ్రామస్థులు నల్లజెండాలు కట్టి నిరసన తెలుపుతున్నారు.

గుంటూరులో సోమవారం ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి మేకతోటి సుచరిత ఇంటిని ముట్టడించారు. మంత్రి ఇంటి ఎదుట బైఠాయించిన మాజీ మంత్రి ఆలపాటి రాజా, తెలుగుదేశం పార్టీ నాయకులు డేగల ప్రభాకర, నసీర్, మల్లి, కనపర్తి, గోళ్ళ ప్రభాకర్ బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రభుత్వం భారీగా పోలీసులను మోహరించింది. వాహనాలను క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే బ్యారేజ్ మీదకు అనుమతిస్తున్నారు.

  • రాజధాని కోసం ప్రభుత్వాన్ని నమ్మి భూములిచ్చాం… ఇప్పుడు పిల్లా పెద్దా అంతా రోడ్డున పడ్డాం
  • దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులు ఎందుకున్నాయి?

ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు, అమరావతి సంయుక్త కార్యాచరణ సమితి ‘చలో అసెంబ్లీ’కి పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులు, జేఏసీ ప్రతినిధుల ఇళ్ల వద్ద పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ముందస్తు బందోబస్తు చేపట్టారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసుల పికెటింగ్ ఏర్పాటు చేశారు. మందడం సహా, పలు గ్రామాల్లో పోలీసులను భారీగా మోహరించారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ శాసనసభ వద్ద టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆందోళనలో పాల్గొన్నారు.

రాజధాని అంశంపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా సచివాలయం ఫైర్ స్టేషన్ వద్ద చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కాలినడకన అసెంబ్లీకి బయల్దేరి వెళ్లారు. “ఒక రాష్ట్రం-ఒకే రాజధాని” అనేది ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష అని, భావితరాల కోసo పోరాడతామని, అమరావతిని నిలబెట్టుకుంటామని చంద్రబాబు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు రాజధానుల ప్రతిపాదనకు ఒప్పుకోబోమన్నారు. శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న ప్రజలను అరెస్టు చేయడాన్ని పిరికిపంద చర్యగా ఆయన వ్యాఖ్యానించారు. సచివాలయ ప్రాంతంలో రైతులతో కలిసి ఆందోళనలో పాల్గొన్న గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే తమ ఉద్దేశమని మంత్రి బొత్స సత్యనారాయణ అసెంబ్లీలో చెప్పారు. 13 జిల్లాలను అభివృద్ధి చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, వనరులు అన్నీ ఒకే ప్రాంతానికి కేటాయించడం మంచిది కాదని భావించి సీఆర్‌డీఏ రద్దుకు నిర్ణయించామని తెలిపారు. గత ప్రభుత్వాలు చేసుకున్న ఒప్పందాలను గౌరవిస్తామన్నారు.

భూముల కొనుగోళ్లు, కేటాయింపులకు సంబంధించి ఆర్థిక మంత్రి చేసిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని సభాపతిగా తాను కోరుతున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు. స్పీకర్ నిర్ణయంపై విపక్ష టీడీపీ అభ్యంతరాలు చేసింది. ఈ సందర్భంలో టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.

ముఖ్యమంత్రి జగన్ స్పందిస్తూ- మీ(స్పీకర్) ఆదేశాలు కచ్చితంగా అమలయ్యేలా చేస్తామని ప్రకటించారు. స్పీకర్ ‘క్వాజీ-జ్యుడిషియల్’ అథారిటీ అని, న్యాయమూర్తి వంటి వారని ఆయన వ్యాఖ్యానించారు.

(Courtesy BBC)

RELATED ARTICLES

Latest Updates