1500 కుటుంబాల కుల బహిష్కరణ
నిజామాబాద్ జిల్లా బాల్కొ ండ మండల కేంద్రంలో 1500 కుటుంబాలను బాల్కొ ండ గ్రామాభివృద్ధి కమిటీ కుల బహిష్కరణ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టణానికి చెందిన పద్మశాలి అయిన డాక్టర్ రాజుతో జరిగిన భూ తగాదాలు కుల సంఘంపై రుద్ది కులస్థులం దరినీ వీడీసీ బహిష్కరణ చేసినట్టు తెలిసింది. బా ల్కొండలో సుమారు 300పైగా పద్మశాలి కుటుంబా లు ఉన్నాయి. ఆ కుటుంబాలన్నింటిపై బహిష్కరణ వేటు వేసి వారికి ఎలాంటి సహాయ సహకారాలు అందించొద్దని, పాలు, పెరుగు అమ్మొద్దని గ్రామాభివృ ద్ధి కమిటీ సభ్యులు హుకుం జారీ చేశారు.
అక్కడితో ఆగకుండా మున్నూరు కాపు కులస్థులకు చెందిన ఇళ్ల లో అద్దెకు ఉంటున్న పద్మశాలీలను ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. ఇప్పటికే కొంద రు ఇంటి యజమానులు తమ ఇళ్లలో ఉన్న పలు దుకాణాలను, వ్యాపార సముదాయాలను తొలగించా లని పట్టుబడుతున్నట్టు సమాచారం. చేసేదేమి లేక ఖాళీ చేయాల్సిన పరిస్థితి నెలకొందని పద్మశాలీలు వాపోతున్నారు. ఓ వ్యక్తి భూ తగాదా కుల సంఘం పై రుద్దడం ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
1200 ముస్లిం కుటుంబాలపై నిషేధం..
బాల్కొండకు చెందిన 1200 కుటుంబాలపై వీడీసీ సాంఘిక బహిష్కరణ విధించినట్టు తెలిసింది. ము స్లింలకు చెందిన ఖబ్రస్థాన్లో సమాధులను తొలగిం చిన కమిటీ సభ్యులపై గతంలో ముస్లింలు పోలీసు లను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. అయితే ఆ స్థలం తమదేనని కమిటీ సభ్యులు పోలీసులకు వివరిం చారు. ఆర్మూర్ డీఎస్పీ సంఘటన స్థలాన్ని పరిశీలి ంచి ఇరువర్గాల మధ్య సయోద్య కుదిర్చి సమస్య తలె త్తకుండా చూడాలని నచ్చజెప్పి వెళ్లారు.
ఆ స్థలానికి చెందిన పట్టాపత్రాలు కమిటీ సభ్యుల వద్ద ఉండడ ంతో అందుకు భూ విలువలు కట్టిస్తామని ముస్లింలు హామీ ఇచ్చారు. తాజాగా ముస్లింలు పెట్టిన కేసు ఉపసంహరించుకోవాలని తెరపైకి తెచ్చి కుల బహి ష్కరణ విధించినట్టు తెలుస్తోంది. పాలు, పెరుగు అ మ్మొద్దని, వారి ఆటోలలో ప్రయాణించివద్దని షరతు లు విధించారు. ముస్లింలను అద్దె ఇళ్ల నుంచి ఖాళీ చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది.
సిట్టింగ్ ఖర్చు చెల్లించాలని గౌడ్లపై నిషేధం..
బాల్కొండలో ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మి స్తున్న కట్టడాలు, భూ కబ్జాలపై ఇద్దరు గౌడ కుల స్థులు ఆర్టీఐ కింద భూ వివరాలు సేకరించారు. అయితే తమకు తెలియకుండా భూ వివారాలు ఎలా సేకరిస్తారన్న ఆక్కసుతో వీడీసీ సభ్యులు ఆర్టీఐ కార్యకర్తలను పిలిపించి జరిమానా ఇవ్వాలని అన డంతో ఆందుకు వారు అంగీకరించకుండా వెళ్లిపో యారు.
సిట్టింగ్కు అయిన మూడు లక్షల ఖర్చును గౌడ కులస్థులు చెల్లించాలని డిమాండ్ చేశారు. దాని కి వారు ససేమిరా అనడంతో గౌడ్లను నిషేధించి సాంఘిక బహిష్కరణ చేసి అమలు పర్చారని, ఎక్క డ తమ అక్రమాలు బయటపడుతాయోనని తమపై కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని గౌడ కుల స్థులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 1500 కుటుంబాల బహిష్కరణ అంశమే చర్చనీయాంశంగా మారింది.